పుట:శృంగారనైషధము (1951).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

255


తీర్థవాసులును మాంత్రికులు దాయాదులుఁ
        దర్కవాదులును గ్రోధంబుపాలు
యజనదీక్షితులు నధ్యయనపాఠకులును
        భస్మగుంఠనులు లోభంబుపాలు
బాలవైతండికపామరాహంకార
        చుంబకమతులు మోహంబుపాలు


తే.

కేళిసౌధమహాచంద్రశాలయందు
హంసతూలికపాన్పుపై నహరహంబు
నవవధూకేళివిహరోన్మత్తుఁ డైన
నిషధనాథుండు నాపాలు నిక్క మరయ.

138


వ.

అని యందఱ నియోగించి.

139


ఉ.

కాకపతాకతో ఘనసృగాలకిశోరకరథ్యపంక్తితో
గీకసఫాలికాఘటితకింకిణికావలితోడఁ గూడి భ
ల్లూకపకృత్తికౢప్తమగులోహశతాంగముఁ గొంచుఁబోవ నా
జ్ఞాకృతిఁ బంచె నప్డు నిజసారథి యైనదురాత్ము దుస్సహున్.

140


వ.

పంచి యనంతరంబభ యన్నిర్దయుండు దానును గర్దభధూళిలగ్నంబున నిషధనగరంబుఁ బ్రవేశించి సంధ్యాకాలంబున మసకమసక చీఁకటిం గుఱుమాపుడుం బుట్టంబు ముసుంగు వెట్టికొని పెడతెరువున శూన్యభవనద్వారవేదికావిటంకంబుల విశ్రమించుచు దేవమందిరప్రాంగణంబులకుం దొలంగి వేశవాటంబునడుమ నొయ్యన నడచి యట మలంగి దురోదరక్రీడావినోదంబుల ననుమోదించుచుఁ గాదంబరీగృహంబు లొరసికొనుచుఁ జైత్యంబులు గడచి శృంగాటకంబులు దాఁటి దూరంబు చని నిభృతప్రకారంబున నృపా