పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షాంకురతటస్థమకరాంక! [1](వృషభేశ్వర శు)
భాంక! మకుటస్ఫుటమృగాంకనవరేఖా
లంకరణ! భక్తజనపంకహరణా! భనవి
సంకటకళంకహర! కింకరు ననున్ క్షే
మంకరుఁడవై మనుపు మంకిలి యొనర్పక ని
రంకుశకృపారసవిశంకట! నమస్తే. 279

క. పరమగురుద్రోహి ననుం
గరుణించఁ గద యనన్య(గతికుఁడ ననినన్)
గిరిజావల్లభుఁ డతనికిఁ
గరుణామతి నిట్టులనియెఁ గడుప్రియ మెసఁగన్. 280

ఉ. మే మొకమాట దెల్పెదము మించి మదీయవచోవిశేషసం
రామహిమం బొకింతయును దప్పదు తప్పక యున్న నేమి ల
క్ష్మీమహనీయవైభవసమృద్ధియు బుద్ధియు మోహనాంగరే
ఖామహిమంబు నీకుఁ గలుగం గృప సేసితి నమ్ము నెమ్మదిన్. 281

క. విమలమతుల్ మద్భక్తులు
సుమతీహరదత్తు లనఁగ క్షోణిం గల రా
రమణీరమణులకు మనః
ప్రమదముగ జనింపు మమితభాగ్యోన్నతివై. 282

తే. అన విని మహాప్రసాదం బటంచు వచ్చి
యిందుశేఖరు నానతి నిందుఁ (బొడమె)
మదను నాహ్వయమునను నోమగువ! వైశ్య
తల్లంజుండైన (నీ) ప్రాణవల్లభుండు. 283

క. వింటివొ యన నల భామిని
గెంట తల యూఁచి మెచ్చి కీరపరుని నీ

  1. వృషభేశ్వర నమశు (పూ)