పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

442 శుక సప్తతి

వెఱవనేటికి నట్టివిద్యలచవియెఱుం
గఁడుగాని చొరబారగలఁడటంచు
గీ. నొంటిపాటునఁ బలికి యాయువిదయమ్మ
చెల్ల యీమాట లెవ్వరిచెవులఁ బడెనొ
యనుచు నాలుగుదిక్కులు నరిసిఁ జేరి
వాని నెమ్మది నొకవింతవలపు నెఱపు. 250

క. ఈరీతి నవ్వధూమణి
చారణు లోఁబఱచి యొకనిశావేళ తమః
పూరితమగు నొకయింటన్
చేరిచికొని యిష్టకార్యసిద్ధింగొనియెన్. 251

క. కని యదిమొదలుగఁ ద
త్యనుపమసౌఖ్యాబ్ధి నోలలాడుచు మరునిం
దనబంటుగాఁ దలంపుచు
ఘనతరగర్భమున కన్నుఁగానక మెలఁగెన్. 252

క. అంతట బాలామణియగు
శాంతం బోషింప మఱచి చారణనిమగ్న
స్వాంతత్వము జెందిన త
త్కాంతామణినడక లెల్ల గాంచిన యదియై. 253

గీ. శాంతయును బాలయయ్యునుఁ జతుర యగుట
దీనికి భయంబుఁ జూపినగాని తనకుఁ
బోషణము చేయదిది యని బుద్ధిఁ దలఁచి
యోర్చికొనియుండి యంతట నొక్కనాఁడు. 254

చ. జనకునిఁ జేరి యాతనికి సంతసమయ్యెడుమాటలాడి, సొం
పెనయగ నీవుగాక మరి యింకొకతండ్రి గలఁడు నాకుఁ బొ