పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

440 శుకసప్తతి

సఖియెడాటమున నిచ్చకముగా వర్తించి
ధాత్రియుఁగూడి మంతనములాడి
ప్రాతివేశిని దనప్రాణంబుగాఁ జూచి
లెంకలతోడ మాలిమి యొనర్చి
శిల్పినీరుదికి మచ్చికబుట్ట నడపించి
తనకు దాసాహాయ్యమును భజించి
గీ. యత్తికామాతులసుతాదు లైనబంధు
గంధసింధురగమనల గారవించి
యేయుపాయంబులను గోర్కె యెనయనేని
తన మహాంతఃపురాధివాసనకుఁ గనలు. 243

సీ. తనివిదీఱఁగ నందతనయుతో రతికేళిఁ
బెనఁగిన గొల్లగుచ్చెతలమనువు
చంద్రునంతటి నిండుజాణ కౌఁగిటఁ జొక్కి
తమిఁగడఁదేర్చిన తారబ్రతుకు
నేమగమిని యైనదేవేంద్రు నన్యునిగూడి
కాంక్షఁజెందు నహల్యకాపురంబు
శివుగూడి తనివిఁగాంచినయట్టి దారుకా
వనమౌనికాంతలవర్తనంబు
గీ. మెచ్చుగాక మఱేమి యీమేనియందు
యనుభవించనిసౌఖ్య మే లనుచు వనిత
యింటిలోనుండి చావడి నెవ్వరైన
సరసరీతిప్రబంధముల్ చదివిరేని. 244

ఉ. ఏవురతోడఁగూడి రమియించగ భాగ్యముఁ జేసెఁ గావునన్
ద్రౌపది మెచ్చవచ్చునని తొయ్యలి సంతసమందునంతలో