పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 439

భానుతశాంతపేరి యొకబాలికె గాంచి దివంబు సెంద సం
తానము గోరి లోలయనుత న్వివరించి రమించె నంతటన్. 239

ఉ. ఆలలితాంగికంటికి ప్రియంబగుసొమ్ము ధరించి సేవక
శ్రీల మఱంగి జిహ్వకు రుచించుపదార్థము లాహరింప నే
వేళ ప్రసూనతల్పమున వేడుకమై బవళింపుగల్గుటన్
చాల మదించి జారజనసంగతికై తివురుబ్బిగల్వగాన్. 240

సీ. రేయిదాల్చినవిరుల్ వ్రేలుగొప్పున జాఱ
నగుమోము జిగిమించ నదికి నరుగు
పుక్కిటివీడె మబ్బురపునీటు ఘటింప
కులుకు నెన్నడలతో గుడికి నరుగు
పయ్యెద వీడ గుబ్బలనిగ్గు గనుపట్ట
నెమ్మితోఁ జుట్టము లిండ్ల కరుగు
పావడపై వ్రాఁతపని జీర రాణింప
కొమరుతో వనభోజనముల కరుగు
గీ. నరుగుచో మంచిమగవాఁ డెదురనుపడగ
వనిత తగవాని నటు బిగాబగలఁజూచు
సోగకడకంటి నెఱవాఁడి సొలపుఁదళుకు
బెళుకుచూపుల నయ్యిందుబింబవదన. 241

గీ. ఇంట నేతెంచుచుట్టంపు టెమ్మకాండ్ర
తరచుగాఁ బిల్చితేర ద్రస్తరులు బలికి
తన్మనంబుల రాగకందళము లునిచి
యతిభయాతతమున వాఁడ నడలుపడతి. 242

సీ. దూతికపట్ల నెంతోమైత్రి పాటించి
దానికి మన సిచ్చి తగులు నెఱపి