ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము 429
గములుగా వచ్చి తానములాడు కర్ణాట
సతులపాటీరంపుసౌరభంబు
హితులతోడుగవచ్చి యీఁదెడి ద్రావెడ
పంక్తి మంజలికాపుపరిమళంబు
గీ. తగులుకొని మించుకరులగంధములచేత
తైర్థికావళి బడలికల్ తలగఁజేసి
తనశ్రమాపహనామంబు ధన్యతమము
గా మిటారించె నిత్యపుష్కరిణి వింటె! 188
గీ. కమలమకరందరసమధ్యకన్యకాపు
కారము వసించి నిత్యపుష్కరిణిజలము
నడుమ నందంబునొందె కుందనపుతగుడు
లంటి దాపిన నవరత్నమంటపంబు. 189
సీ. ఎవ్వరి నని దాల్తు నే నటంచు విహంగ
విభుఁడు చింతించి నావెనక కొదుగు
దొర యెవ్వఁడని బరాబరి సేయుదు నటంచు
సైన్యనాథుండు నిశ్చలతనొందు
నధిపుఁ డౌ సతండు రమ్మనిన జేరెదు నంచు
బలవైరి దవ్వుదవ్వులనె వచ్చు
నాయకనిర్దారణాశక్తి జాలమి
నెత్తమ్మిచూలి నోరెత్త వెఱచు
గీ. నెఱయు నీనిత్యపుష్కరిణీజలమ్ము
మునిగి గ్రక్కున లేచినజనులశంఖ
చక్రపీతాంబరాదిలక్షణవిరాజ
మానవిష్ణుసామాప్యు లైనకతన. 190