పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

428 శుక సప్తతి

గీ. స్నానతటగతజనపటాంచలవిగళిత
నీరసంకేశనికటవనీతలమునఁ
గడగి మునివేళ్ళ బట్టూఁది నడచువారు
గలిగి తన రారు నిత్యపుష్కరిణి గంటె! 185

సీ. పూర్వభాగమున నద్భుతలీల జాహ్నవీ
గోదావరీనదుల్ గొండ్లి సలుప
నగ్నికోణంబున యమునాసరస్వతీ
ఝురీణులు నిండుగాపురముఁ జేయ
దక్షిణంబున సముత్కంఠతో నర్మదా
సింధుస్రవంతులు సిరులు గాంచ
నిరుతిదిక్కున నిందితతామ్రపర్ణీక
వేరనదులు వేర్వేరఁ బొసగ
గీ. పశ్చిమంబున తుంగయు భద్రయును స
మీరునెడ కృష్ణవేణి కుబేరదిశమ
లాపహయు, భీమరథియు, హరాశ, రసయు
నెలమి భవనాశనియు నిల్వనిది సెలంగు. 186

చ. తటమహిజాతనూతనలతాగళితసవాశితోడి యు
త్కటమకరందబృందములు దాల్చిన యర్ధవికస్వరాంబురు
ట్పటలము పద్మతోయములు బర్వగఁ బుణ్యసరఃకదంబమే కడా
పట నరుదెంచి యిందు మునుగన్ వలకొన్నవిధంబు దెల్పెడున్. 187

సీ. ముసుకులతో వచ్చి మునిగెడు శుద్ధాంత
కాంతలకస్తూరికమ్మవలపు
బలుబరాబరులు బోల్పడవచ్చి గ్రుంకు భా
మినుల చొక్కపుఁదట్టుపునుగుతావి