పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 373


దారత నేగి గంధవతిఁ దద్దయు మెచ్చుచు వచ్చుచు న్నెడన్.

579


క.

ఆరమణియు నభిరాముఁడు
గ్రూరుని నిరువంకఁ బెట్టుకొని యయ్యో యీ
యూరికి దొర లేడా యీ
చోరుని దండింప ననుచు స్రుక్కక కూయన్.

580


క.

ఆమాటవిని తలారు ల
దేమని గద్దింప నామృగేక్షణ రొదగా
నామగఁ డితఁడని యయ్యభి
రాముని వెసఁజూపి నిబ్బరంబునఁ బలికెన్.

581


తే.

ఆలుమగఁడును నియ్యూరి యఱుత నిలిచి
చలిది భుజియింప నాసొమ్ము సంగ్రహించె
గొట్టుసేయక వీనిఁ జూపట్టుకొనుచు
నిచ్చటికిఁ దెచ్చితిమి పట్టుఁ డిప్పు డితని.

582


వ.

అనిన విని యన్నగరరక్షకు లాక్షేపపూర్వకంబుగా నతనిం
బట్టుకొని బాధించి శోధించి యొడిలోని యాభరణములం గనుంగొని దొంగయగు నని నిశ్చయించి యభిమానధనున కెఱింగించి మూఁడుత్తరువులు గైకొని నిజకామినీకుహనసంజనితవిస్మయాదృతప్రత్యుత్తరుం డగు నతని వధియించి యమ్మండనంబు లిచ్చినం జపలాభిరాములు సంపూర్ణకాములై యథేచ్ఛ నరిగి రాక్రూరుండును నన్యాయహతుం డయ్యెం గావునం బిశాచంబై యాచారవంతులం గని తలంగంబాఱుచు మాంత్రికులం గని గడగడ వడంకుచు నాయుధహస్తులం జూచి యేచినభయంబునుం బొందుచు భైర