పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358 శుకసప్తతి


తే.

తనదు కథలకుఁ దరళికాతరళనయన
యాదిగాఁగల్గు నంతఃపురాబ్జముఖులు
పుష్పహాసప్రముఖమంత్రిపుంగవులును
వచ్చి యుండుటఁ దెలిసి యవ్వామనయన.

505


మ.

సభవారెల్లను సద్దుమాని వినుఁడీ సర్వంసహామండల
ప్రభుతోఁ దెల్పెద విక్రమార్కనృపచంద్రా సావధానంబుగా
శుభదం బీకథఁ జిత్తగింపవలె నంచుం దెల్పఁ జొచ్చె న్సుర
ర్షభకేళీవనికామరందరసవాచాప్రాచురీచాతురిన్.

506

ఎనిమిదవ యుపకథ

క.

గంధవతీ నామకము వ
సుంధర నొకపురము కరము శోభిలు భాస్వ
త్సైంధవచయాతిపత్రిత
బంధురమణిసౌధకేతుపటపటలం బై.

507


క.

ఆనగరరత్న మేలు
న్మానధనుం డనఁగఁ బరఁగు మానవపతిత
త్సూనుం డభిమానధనా
ఖ్యానవనీయుండు వెలయు నధికప్రజ్ఞన్.

508


తే.

అతఁడు జనకుని వెనుకఁ బట్టాభిషేక
మవధరించి నిజామాత్యులాప్తకోటి
యనుదినంబును విన్నవించిన వివాహ
మొల్ల నని నిస్పృహుండయి యుండె నంత.

509


క.

చనవరు లందఱు నొకనాఁ
డనఘా కల్యాణ మొల్ల ననుకారణమే