పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344 శుకసప్తతి

నిలవేగంబునఁ గాలుకొల్చి పతగానీకంబు పాకంబుగా
నలరించె న్సమయాఖ్యపాచకుఁడు భూతాహారసంప్రాప్తికిన్. 445

మ. జలమింక న్నయనంబు లాతపభయభ్రాంతంబులై మధ్యసం
ధ్యలనుం దోఁచని యంబుకేళికయి ప్రాతర్వాసరాపోదయం
బులఁ గాన్పించె ననంగఁ దీరనగరాంభోజాతనీరాకరం
బులు నీరార్చుటకైన బల్చెలమల న్బొల్పొందె నవ్వేసవిన్. 446

తే. దారుణారుణకిరణసంతాపదిశల
ననుభవింపఁగఁ జాలక యంబుదములు
మెఱుపు లుఱుములు దొరఁగి భూమిపనికాయ్య
దేశముల నిల్చె ధూమంపుఁదిత్తు లగుచు. 447

క. ఆవేసవి నిష్కాసితుఁ
డై వసుథాదేవుఁ డొక్కఁ డాత్మపురీయా
శ్రావేశితకుతుకంబున
నావట మున్నట్టిత్రోవ నరుదెంచె వెసన్. 448

సీ. గమనవేగంబునం గావిడి వెదురు వె
క్కసపు మ్రోఁతలఁ గిఱ్ఱుకఱ్ఱు మనఁగ
సగళకరోటిపై బిగియఁ జుట్టిన పటాం
చల మింత గాలిచే సంచలింప
సరకులుంచిన మాత్రసంచిలో నంటగ
ట్టిన యట్టి నేతిలడ్డిగ దనర్పఁ
గొనలెత్తి కదియఁజెక్కిన కావిధోవతి
పైఁ గట్టుకొన్న కంబళీ యెసంగ
తే. నాతపగ్లానిచే నీడ లరయఁబాఱి
గాఢవీక్ష నిరాశచే గ్రమ్మఱంగ