పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334 శుకసప్తతి

తే. గర్ణకంఠోదరాభారకంబు లగుచు
నమరు ముయ్యూరుపిడుఁదుతండములతోడ
నచ్చటికి వచ్చె నొకయశ్వ మల్పహేష
జాతి దెల్పఁగ జలపానసంభ్రమమున. 395

ఉ. వచ్చి జలంబు గ్రోల నిలువంబడఁ గల్గొని బుద్ధిసారుఁ డు
ద్యచ్చతురత్వ మొప్ప వినయంబునఁ జేరి నమస్కరించి యే
నిచ్చట నిన్నుఁ జూచి చనియెన్ బహుకాలము నేఁడుగంటినా
ముచ్చట లెల్లఁ దీఱ మన మున్పటి నెయ్యము లెంచుకొందువే. 396

చ. అది యటు లుండె తను వనంతబలాఢ్యము బక్కచిక్కియు
న్నది యిది మాఱురూపువడి యద్దిగ యిద్దురవస్థ యేక్రియం
గదిసనొ నన్నువంటి చెలికాఁ డొకఁ డుండఁగ నిమ్మనోవ్యథా
భ్యుదయము వొందనేటికి నయో నను వింతఁగఁ జూడఁ బాడియే. 397

క. అనిన విని యత్తురంగం
బనఘా నిను మఱవనేర్తునా బహుకాలం
బునకైన బుద్ధిసారుం
డనుసుకృతివి గావె నెయ్య మలఁతియె మనకున్. 398

క. మామా యల్లుఁడ వని మన
మామాడ్కిన్ వావి యొకటి యమరించి నయ
శ్రీమించఁ బ్రవరిల్లుట
యేమైన న్మఱచువాఁడనే గుణహారా. 399

చ. ప్రకటవిషాదవేదనవరస్పరవృత్తి నినుం గనంగఁ దా
వకవిహితప్రవృత్తికి నవజ్ఞత యెంచక పల్కరించి నీ