పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 309

గంతునిభుఁ డైన ధరణీ
కాంతునికడ కరుగుచో శుకం బిట్లనియెన్. 235

తే. అమ్మ యమ్మంత్రిసుతప్రభావమ్ము వినుము
విక్రమార్కవసుంధరావిభుఁ డొకింత
తెలిసికొనలేక మఱునాఁడు పిలువఁబనుప
జనియె నమ్మీననయన యాస్థానమునకు. 286

వ. చని యవనీకాంతసమాసీన యగుటయు నమ్మానవేశ్వరుం డితరప్రసంగంబున కవకాశం బొసంగక యంబుచరహాసంబునకుఁ గారణంబుఁ దెలుపుమనిన నచ్చెలువ కలకల నవ్వి పరుల నడుగందగని కార్యం బడిగెద విట్లయిన ననాచరణీయం బగుప్రయోజనం బొనర్చి యాపిమ్మట వనటకుంబాలైన పాలికయను బాలికతోడి పోలికగలవాఁడ వగుదు వది యెట్లనిన నవధానంబుతో వినుమని యిట్లనియె. 287

రెండవయుపకథ


క. ధరపై రత్నావళి యను
పుర మొక్కటి కలదు గగనపూరితమణిగో
పురమై పరమేశ్వర్యా
కరమై సరమై కలసదగారోత్కరమై. 288

క. ఆవీట రత్నవిదుఁ డనఁ
గా వైశ్యాగ్రణి యొకండు కలఁ డాతనికిన్
దేవేరి యొకతె మన్మథ
దైవతమై పాలికాభిదాన తనర్చున్. 239