పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308 శుకసప్తతి

నును జని పిళ్లారిని నలు
కిన నతఁడే యిచ్చు సిరులు గెలిచితి ననుచున్. 279

తే. అంత నేగిన గణనాయకాలయమున
కరిగె నాతండు సుమతియు నపుడె చనియె
వారి నిద్దఱిఁ జూచి యవ్వారణాస్యుఁ
డధికకోపానుతాపదురాపుఁ డగుచు. 280

తే. ఒరుల కేటికిఁ దెలిపితి వోరి యనుచు
సుమతిఁ గొట్టించెఁ బ్రమథయూధములచేత
నేర నీ వేలవచ్చితీ వోరి యనుచు
నట్లు సేయించె నాఁడేగినట్టివాని. 281

తే. ఆసుమతి యట్లు నొగిలి గేహంబుఁ జేరి
యంతయును దెల్పఁ బద్మిని యడరు వగలం
దూలి మందోదరీకాంత తోడనేల
దెలిపితి నటంచు మిగులఁ జింతిలఁదొడంగె. 282

ఉ. కావున విక్రమార్క వెనుకన్మదిలో నిటువంటికార్య మే
లా వినిపింపు మంటి నని లాఘవవృత్తికి లోనుగాక నీ
వే విశదంబుగా నరయు మీ దినమెల్లను దోఁపకున్న నే
నీవిధమంచు ఱేపు వచియించెద నేఁడటు పోయివచ్చెదన్. 283

క. అని బాలసరస్వతి య
జ్జనపతికిని దెలిపె నని రసస్థితి మిగుల
న్వనిత కలశుకము దెలుపం
దినకరుఁ డుదయాద్రికరుగుదేఁ దఱి యయ్యెన్. 284

క. అంతఁ బ్రభావతి కేళిని
శాంతమునకు నేగి నాఁటి సంధ్యావేళన్