పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 225

గొనలుగల్గినదర్భకోటినేలిన కురు
ల్గట్టిగా నెన్నఁడు పట్టుకొందుఁ
బంచామృతముఁ గ్రిందుపఱచు వాక్సుధచవు
ల్తనివంద నెన్నఁడు ద్రావికొందు
తే. ననుచుఁ గోరుచు నవ్వుచు నాడికొనుచు
సారె గేరుచుఁ జూచినవారు వీని
పుట్టు కిష్కంధలోను గాఁబోలుననఁగ
నాసుశర్మయు నాత్మగేహమున కరిగె. 482

తే. ఇవ్విధంబునఁ దనయింటికేగి హలిక
కాంత రమ్మనె బసవద్దు గదలకుండు
చోటికక్కట యదియెట్టుచోటు తెలియ
నడుగలేనైతినని ఖిన్నుఁడై కృశింప. 483

ఉ. శీలవతీశిరోమణి విచిత్రతరంబగు భర్తహర్ష మ
వ్వేళనుదోఁచు తద్వ్యథయు వేమఱుగన్గొని చేరి దీనతా
శ్రీలలితంబుగా నతఁడు చెప్పిన నించుక చింతనేసి వా
చాలసమానమాధురి విశాలము గాంచి రహించ నిట్లనెన్. 484

క. బసవద్దు గదలకుండెడు
వసతియు నన్నదిది యన్న వనజారికళా
లసమానమౌళిగోవెల
మసలక యటు పొండు నేఁటి మాపటి కనినన్. 485

క. పరమామోదత నెంతటి
వెరవరి విది తెలిసినపుడె విద్వాంసునికూఁ
తురవగు దని యతఁ డా సుం
దరి వడ్డింపంగ భోజనము దీర్చి వెసన్. 486