పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 219

దండహత్తి మనోజుండు దండవెట్టె
నమ్మహీదేవు నెమ్మది రిమ్మవొడమ. 454

ఉ. అంతట రెడ్డి పంపఁగ మృగాక్షిగృహంబున కేగ దాని యా
ద్యంతశరీరసౌష్టవమునందు మెలంగు మనంబులోపలం
గంతులుగోరి కోరికలు గంతులు వైవఁ గృషీవలాజ్ఞ గే
హాంతర మొంది చెందు విరహజ్జ్వర ముజ్జ్వలమైనఁ గుందుచున్. 455

తే. అద్ధరాదేవుఁ డాహలికాబ్జవదన
గన్న కన్నుల కింటిలో గరితరూప
మెట్టులుండునొ కాని సహింపఁడయ్యెఁ
దద్బహుకృతోపచారవిధంబు లెల్ల. 456

సీ. కీలుగం టిదియేల పోలఁగా నునుఁగొప్పుఁ
గీల్కొల్పు కొమ్మంచుఁ గీజుపోరుఁ
బసుపుబొ ట్టిదియేల నొసటవిభూతిరే
ఖ యమర్చికొమ్మంచుఁ గంటగించుఁ
గాసెక ట్టిదియేల కపురుగా మైజారు
చీరఁదాల్చు మటంచుఁ జిమ్మ రేగు
లక్కాకు లివియేల చొక్కంపుటంచు క
మలు ధరించు మటంచు నలుకఁ గాంచు
తే. భార్యతో నాయమయు వెఱ్ఱిపట్టె నేమొ
యనుచు నాలాగె కావింప నతఁడు హలిక
లికుచకుచవేషమేకాని యకట దాని
యొరపు లేదని యాత్మలోఁ బరితపించు. 457