పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XXV

కదిరీపతియనంతరము నూఱేండ్లతర్వాత వచ్చిన యయ్యలరాజు నారాయణామాత్యకవి హంసవింశతి యను కావ్యమును పూర్తిగా శుకసప్తతి ననుసరించియే రచించెను. నూర్ల కొలది పద్యాలలో శుకసప్తతిలోని వర్ణనలను, పంక్తులను, మార్పేమియు చేయక స్వీకరించెను. అయ్యలరాజు స్వతంత్రముగా ననుకరణావశ్యకత లేకయే చక్కనికవితను వ్రాయగల శక్తిసామర్థ్యములుకలవాఁడే కాని యతనికి శుకసప్తతిపై యపారాభిమాన ముండినట్లు రూపించుకొన్నాఁడు.

ప్రకృతతృతీయముద్రణము

శుకసప్తతిని మొట్టమొదటిసారి 1909 లో కాకినాడలోని సరస్వతీపత్రికవారు ముద్రించిరి. ఆముద్రణమును గురించిన విశేషములు మొదటిముద్రణపీఠికనుండి వెల్లడి యగును. తర్వాత 1935 లో వావిళ్లవా రసమగ్రమగు కృత్యాదిపద్యములతో చక్కనియచ్చుతో రెండవముద్రణము కావించిరి. ఇప్పటి యీముద్రణములోఁ బూర్వముద్రణములలోని తప్పులు సవరింపనైనవి. మఱియు కృత్యాదిపద్యములు సమగ్రముగా ముద్రితమైనవి. పాఠాంతరములు కొన్ని యీయబడినవి. శుకసప్తతిలో నించుమించు 100 పదము లర్థము కానివై యందు బహుళపదములు నిఘంటువులలో లేనివై యున్నవి. అట్టిపదములలో 9౦ పదముల కర్థనిరూపణము చేసి గ్రంథాంతమం దకారాదిగా ముద్రింపనైనది.

ఈ ముద్రణమువఱకు కావ్యముందు కొరవడినభాగాలు లభించుట యత్యంత ముదావహము.