పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 217

మారేడుబుఱ్ఱలో మంత్రాక్షతంబులు
పదములవిజ్జోడు పాదరక్ష
తే. లొడిసి పంచాంగ మొకకేలఁ బొడుపువ్రేల
వెండియుంగరమును మెడవ్రేలుముఱికి
జందెములు నవ్యయాచ్యుతస్మరణమాస్య
సీమఁ గనుపింపఁ బఱతెంచెఁ జేనికడకు. 443

ఉ. వచ్చినఁ బెద్దరెడ్డి సుగవాసివి మేలిపుడైన నీడకున్
వచ్చితె యంచు బావయనువావిని ద్రస్తరలాడి బాపఁ డా
యిచ్చటఁ జల్లువిత్తు ఫలియించునె వేళగుణం బెఱింగి నా
యిచ్చకు మెచ్చుగా వదరు మిప్పుడ నన్విని యాతఁ డుబ్బుచున్. 444

ఉ. చెప్పిన నేమి లేదుగద చింపులదోవతిఁ జూడు మేను మీ
కెప్పుడు మేలుఁగోరి మఱియెక్కలిదేవికి గ్రామగంగకుం
జప్పిడిఁ దించు మ్రొక్కుకొనుజాడ లెఱుంగవె యిట్టిపట్ల నే
చొప్పున నాశ్రితుం గరుణఁజూడరుగా కదియేల యిత్తఱిన్. 445

ఉ. నిన్నటిరేయి నాయెదుట నిల్చెఁజుమీ కలలోన మీకు మే
ల్పన్నెడు పేరటా ల్నిలిచి బాపఁడ రెడ్డికిఁ దెల్పరాదె న
న్నెన్నఁడు దిన్నె బెట్టి నుతియించుచుఁ గొల్వరటంచుఁ బల్కె నా
కన్నుల నీరు దొట్టి పులక ల్గనుపట్టెడుఁ జూడు మిప్పుడున్. 446

క. అన రెడ్డి మనసు గరఁగం
గనుఁగవ నీరొదవి జాఱఁగను బాపఁడ నే
వినలేను తాళు చెప్పకు
మని మునుపటి దానిచిన్నె లాత్మకుఁ దోఁపన్. 447