పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 185

మగువఁ జననిమ్ము పోవుద
మగునె యసాధ్యమున సాహసాదృతి సలుపన్. 291

క. చలమున నది పైఁబడినం
జులుకనివాఁడ నని యుఱుకఁజూతువు మఱి మాం
సలదేహుఁడ ధావనచే
నలసితిఁ బరువెత్తఁజాలనౌ నిటమీఁదన్. 292

క. నావుడు గోమాయు వనున్
నీవిటు తప్పించుకొన గణించెదు కాయం
బీవగల డాఁచికొని యా
హా విను మెన్నేండ్లు బ్రదుకుదయ్య మృగేంద్రా. 293

క. బలవన్మృగమంత్రులయెడఁ
దలవంపుల కోర్వలేక తఱిమెద మదిలోఁ
దలఁపకు బహుభీతిని లె
మ్మలఘుపరాక్రమ మొనర్ప నందుం గీర్తుల్. 294

క. నను నమ్మవేని యిచ్చటి
వనితీఁగెలు చుట్టి పెనఁచి నాకున్నీకుం
బెనవైచికొమ్ము రమ్మిక
నిను జూచిన నవ్వధూటి నేలం గూలున్. 295

తే. అనుచు నక్క నిజాధీశు నతులశౌర్య
మెనయ బోధించి పెనవై చికొనుచుఁ దెచ్చెఁ
గురుబలావళిఁ జేర నుత్తరుని ధైర్య
శోభితుని జేసి తెచ్చు నర్జునుఁడు వోలె. 296

క. ఈలీల వచ్చు నాశా
ర్దూలసృగాలముల భయముతోఁ గనఁ జేయం