పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 177

ఉ. ఈవన మెల్ల నేలెఁడు మృగేంద్రుఁడుసైతము సాపరాధుఁడై
సేవకుఁ డార్తినా మఱుఁగుఁ జెందినచో మదనుజ్ఞమీఁద సం
భావితుఁ జేసి వాని బహుమానముతోఁ గొనిపోవుఁగాని తే
జోవిభవంబు చూప వెఱుచుం బలవంతుఁడ నేను గావునన్. 248

తే. అట్టి నన్నునుఁ జేరి భయంబు లేని
పొలుపుతోనున్న దీపువుఁబోణి చెంత
ననుచుఁ గవుకునఁ బట్టరా దరయవలయు
యోజన యొనర్చి సేయుట రాజనీతి. 249

క. కార్యాకార్యము లెఱిఁగిన
యార్యుఁడు నామంత్రి జంబుకాగ్రేసరుఁ డా
ధైర్యనిధి సుమతినాయకుఁ
డర్యమపదభక్తుఁ డెచటి కరిగెనొ యెఱుఁగన్. 250

తే. అతని రావించి నావిచారానువృత్తి
జెప్పుదునొ దీని నేటి విచార మింకఁ
గమిచి నా మేనిరక్తమాంసములఁ బీల్ప
సాఁగె నతిగాఢతరలుఠజ్జాఠరాగ్ని. 251

క. అని తెంపు చేసి కనకనఁ
గనుఁగొనల న్నిప్పు లురలఁగా వాలము భూ
మినిఁ దాటించుచుఁ దద్గళ
మును జూచుచు గుఱక యుఱుకఁ బోనటు లున్నన్. 252

క. అబ్బెబ్బులిఁ గన వచ్చెం
దబ్బిబ్బు లిఁకేమినేయుదాన ననుచు న
బ్బిబ్బోకవతి మనంబున
నబ్బురమును భయముఁ ద్రొక్కులాడఁగ నుండెన్. 253