పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 163

ఉ. అంతటఁ గొన్నినా ళ్ళరుగ నయ్యురగాయతవేణి యేటికిం
గాంతుఁడు వోవ వీథిఁబొడకట్టిన కేశవనామభూసురుం
జంతతనంబునం దలుపుచాటున నుండి కరారవిందసం
భ్రాంతిని సన్న చేసి వలరాయనిబారికి లో నొనర్చినన్. 180

తే. ఆతఁ డదియాదిగాఁగ నయ్యబలమగని
మొఱఁగి చావడిలో నిల్చి మొగముసూపుఁ
జిన్నలకు లోఁగు కంచంబుచెంత పిల్లి
కరణి నెదురింటివాకుటఁ గాచియుండు. 181

క. గోవిందుఁడు సవసవగా
నావిధ మించుక యెఱింగి యాత్మోపాయ
శ్రీవెలయింపఁగఁ దలఁచి ర
సావేశమ్మున మెలంగు నంగనతోడన్. 182

క. ఎల్లుండి సమారాధన
చిల్లరవెచ్చములు గొనఁగ శీఘ్రమె యిదె యీ
పల్లియసంతకుఁ జని యే
నెల్లిటి కరు దెంతు పదిల మిల్లని పలుకన్. 183

చ. అది మదిఁదోఁచు వేడుక బయల్పడనీయక వేఁడికంటినీ
రొదవఁగ మోము వాంచనతఁ డోచెడుఁద్రిమ్మరిసమ్మదాశ్రువు
ల్గద యివి యంచు నాత్మను దలంచుచుఁ జింతలనేల ఱేపె వ
చ్చెదనని బుజ్జగించి యతిశీఘ్రమునం బురి నిర్గమించినన్. 184

క. అతఁ డూరు వెడలిచను డ
య్యతివ పదింబదిగఁ దెలిసి యపు డాయెదుటన్