పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114 శుకసప్తతి

సక్రోధచం
డ నిరాతంకము నొక్క భల్లుకము నుండం జేసి గర్వోన్నతిన్. 493

తే. అమ్మహావాహినీజవాభ్యంతరమున
విడిచి చనెఁ గాన నది నీటివెంట నరుగఁ
దొలుత నమ్మందగమన పై వలపుఁ జెంది
పొంచికొనియున్న యవ్విప్రపుంగవుండు. 494

క. కనుఁగొంటి నదె నిధానము
గనుఁగొన నొక మాళ్లబిందె గలిగెఁ గదా యే
మనవచ్చు దైవయత్నం
బని తలఁచుచు మోహవశత నవ్యగ్రమతిన్. 495

మ. తనశిష్యు ల్వెనువెంటరా నడిచి యుద్దండస్థితిం దన్నదీ
వనమధ్యస్థలినున్న మందసము ఠేవం దెచ్చి తత్తీరమం
దునవీనద్రులతానికుంజమున మెచ్చు ల్గుల్కుచో నుంచి య
త్యనురాగంబునఁ గామినీగమనమోహానూనచేతస్కుఁడై. 496

సీ. వలుదలై మెఱయు పార్వణపుముద్దలవంటి
వలిచన్ను లెన్నఁడు వ్రచ్చికొందుఁ
బుణ్యాహపల్లవంబులఁబోలు కెమ్మోవి
గడువేడ్క నెన్నఁడు గఱచికొందుఁ
గొనలు గల్గిన దర్భకోటి నేలెడునెఱు
ల్గట్టిగా నెన్నఁడు పట్టుకొందుఁ
బంచామృతముఁ గ్రిందుపఱచు వాక్సుధ చెవు
ల్తనివంద నెన్నఁడు ద్రావికొందు
తే. ననుచు నేఁగోరికొని యుందు నట్టితలఁపు
లన్నియు ఫలించెఁగా నేఁటికని తలంప