పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 109

వ. కావున. 467

క. నృపతి యగువాఁడు విద్యా
నిపుణున్ బహుకార్యభారనిర్వాహకు శాం
తపరజనమర్మభేదన
కపటమతి న్మంత్రిఁ జేయఁగానగు నబలా. 468

వ. అది యెంతైనం గల దత్తెఱంగునకు నిమిత్తం బేమి యట్లుండనిమ్ము తదనంతరవృత్తాంతంబు వినిపింతు నని యి ట్లనియె. 469

క. జనకుఁ డగువార్ధి రాజుం
గనుప్రేమం దల్లియైన కావేరికడం
జనుకమలపాణి యనన
వ్వనజాయతనేత్ర యేఁటివడి నేగుటయున్. 470

చ. తను మునుజూచి మోహపరితాపము గన్న పురోహితుండు గ్ర
క్కున నిది వేళ యీకుసుమకోమలితో రతికేళివైభవం
బనువుగఁ గోర్కి దీర్చుకొన నంచు మనంబున నెంచి తత్తటీ
వనతలకుంజమంజులనివాసము న న్వెస నొంటి నుండఁగన్. 471

వ. ఆసమయంబున. 472

తే. ఒదిఁగి యలమందసములోన నున్న రాజ
కన్యకామణి మేల్కాంచి కలవరించి
బహువిధంబుల విలపించెఁ బంజరమునఁ
జిక్కువడియున్న క్రొత్తరాచిలుకవోలె. 473

సీ. జనకు నెమ్మనము వజ్రప్రాయ మాయెఁగా
మాయగావించి యీమాడ్కిఁ బనుపఁ