పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 95

గెలన నొకపైఁడి నెత్తమ్మికొలను జూడ
నొప్పునని తెల్పఁ దద్వీక్షణోత్సుకమున. 392

మ. చని యద్దివ్యసరోవరంబున యథేచ్ఛాలీల వర్తించు హం
సనికాయంబులతోడఁ గొంతతడ వంచల్లీల వర్తించి త
త్కనకాంభోరుహవిభ్రమదమరఝంకారధ్వనిం దత్తటీ
వనవాటివిహారద్విచిత్రవిహగవ్యావృత్తి నీక్షించుచున్. 393

తే. మఱియు నచ్చోట విహరించుతఱిని మంద
మందగంధవహాప్తి మై మఱచియుండు
నంత నను నెచ్చరింపక యరిగె బంధు
తతి మనంబున నిల్లాండ్రఁ దలఁచికొనుచు. 394

ఉ. అంతట నాశకుంతబల మవ్వరటాతతిఁ జేరి మోహసం
క్రాంతత నంబుజోత్పలకులాయముల న్విహరింపఁ జూచి వి
భ్రాంతతనొంది మత్ప్రియుఁడు రానితెఱంగిది యేమొయంచు మ
త్కాంత ననుం గనుంగొననితాపమున న్విరహాబ్ధిమగ్నయై. 395

తే. అమ్మ నేఁజెల్ల; నెవతెయో యవలనొక్క
కొమ్మ నాప్రాణవిభు నేలుకొనియె నేమొ
కాకయుండిన ననుఁ జేరరాక యున్నె
యని ప్రలాపించి కనుమూసె నాక్షణంబ. 396

క. ఈవార్తలు సవసవగా
నే విని ప్రాణేశ్వరీ యిదే నను నొంటిం
జోవిడిచి చనుట తగదనీ
భావించి వియోగవహ్నిపరితప్తుఁడనై. 397