పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 98

నాత్మ మెచ్చి తదాలోకనాభిలాష
నప్పు డుద్యానవనవాటి కరుగునంత. 381

చ. మితపరివారుఁడై రణసమిద్ధభుజుండు జయధ్వజుండు త
త్క్షితిపతిమౌళిసమ్ముఖముఁ జేరి విధేయత మ్రొక్కి నిల్చిన
న్మతిఁ గుతుకం బెలర్ప నసమానలసత్కుసుమానమన్మహీ
జతతియేడ న్వసించి సరసస్థితి నాతని కాతఁ డిట్లనున్. 382

క. ఓవత్స నిను మనంబున
భావింపఁగ సార్వభౌమపర్యాయశుభ
శ్రీవిభవము గననయ్యెడు
నీ వెవ్వరివాఁడవయ్య నృపకులతిలకా. 383

ఉ. నీపరిణద్ధకంధరయు నీదువిశాలవిలోచనంబులు
న్నీపటుదీర్ఘబాహువులు నీవిపులోరుకవాటవక్షమున్
బాపురె సర్వభూవలయపాలనముం గలిగించి మించఁగా
నోపుచునున్నవేల యిటు లొంటిఁ జరించెద వంచుఁ బల్కినన్. 384

తే. అప్పు డాజయకేతనుం డతనితోడఁ
దనకులాచారగోత్రసూత్రములు నొడివి
ప్రేమఁ దనతల్లిదండ్రులు పెండ్లిసేతు
మనఁగ విని యొల్ల కేవచ్చి తవనినాథ. 385

చ. అనవిని పాండ్యమండలమహాప్రభుఁ డల్లన నవ్వి యోసుధీ
జనవర పెండ్లియొల్ల మనుజాడ్యమతు ల్గలరే జగంబునన్
విన నిది వింత యిందు కొకవేఱ నిమిత్తము గల్గియున్న నె
మ్మనమున సంశయింపక క్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా. 386

వ. అని యడిగిన నప్పాండ్యమహీమండలేశ్వరున కప్పుణ్యచరిత్రుం డి ట్లనియె. 387