పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92 శుకసప్తతి

వాటమౌ దవనంపుఁదోఁటకంపవెలుంగుఁ
దొలఁగిపో నెవ్వరో త్రోసినారు
దట్టమై నులిగొన్న యట్టిపందిరిద్రాక్ష
తీవ లిం దెవ్వరో త్రెంచినారు
తే. కంటి మాయయ్య రావలెఁ గద యి దెవ్వ
డిందు నేనెత్తు వెలిపువ్వు టెత్తు కేలఁ
బట్టుకొనె నంచుఁ జిడిముడిపడుచుఁ గాఁపుఁ
బడుచువగలాఁడి యప్పుడప్పజ్జ గదిసి. 377

క. తనతేజీ లున్నవి యని
వనవాటిం గనుఁగొనంగ వచ్చిన లక్ష్మీ
తనయుఁ డన నొప్పు జయకే
తనవిభు నీక్షించి మోహతరలేక్షణయై. 378

క. తనతండ్రి యున్నయెడకుం
జని తద్వృత్తాంత మంత చతురతరోక్తిం
గనినట్లు తెలుప విని య
వ్వనపాలకుఁ డద్భుతైకవశమానసుఁడై. 379

ఉ. ఎచ్చట నుండునో మొదల నెవ్వఁడొ యెవ్వరివాఁడొ వీఁడు నేఁ
డిచ్చటి కేగుదేరఁ గత మెయ్యదియో యని తత్కథాక్రమం
బిచ్చజనింపఁ బాండ్యజగతీశ్వరు నీశ్వరసన్నిభు న్సము
ద్యచ్చతురాస్యుఁ గాంచి వినయంబునఁ దద్విధమెల్లఁ జెప్పినన్. 380

తే. ధన్యుఁ డారాజలోకమూర్ధన్యుఁ డతని
రూపయౌవనవిభవప్రతాపములకు