పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సరస్వతీ వ్రతకథ


ఒకానొకప్పుడు సూతమహాముని శౌనకాదిమునీంద్రులను జూచీ యిట్లనియె: "ఓ మునులారా ! మీ రందఱు వినుఁడు. దుర్గా లక్ష్మీ సరస్వతీపూజ యను వ్రతములలో నుత్తమ వ్రతం బొక్కటి కలదు, ఆవ్రతముయొక్క విధానంబు నెఱిఁగించెదను. వినుఁడు, ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలీ వ్రతంబును తొమ్మిది దినములు చేయవలయును. లేదేని మూలానక్షత్రమునాఁటినుండి యైనను జేయవలెను. దానికి శక్తిలేనివాఁడు మహానవమినాఁడైనను జేయవలెను. ఈ వ్రతంబు నాచరించుమానవుఁడు శాశ్వత సంపదతో గూడిన వాఁడై యుండి, యీ దేహంబు విడిచినపిమ్మట దుర్గాదేవియొక్క లోకంబును జెందుచున్నాడు.” అని సూతుఁడు ఋషులతోఁజెప్పఁగా, వా రమ్మునిపుంగవునిఁ జూచి, "ఓమహాత్మా తొల్లి యీ వ్రతంబు నెవ్వ రాచరించిరి? ఎవరికి దీని వలన గొప్పసుఖంబు గలిగెను? ఆనతిం"డని యడుగఁగా సూత మహాముని వారితో నిట్లనియె. “ఓఋషులారా! మీరు సావధానముగా వినుఁడు. ఆవ్రతమహిమను మీకుఁ దెలియఁజెప్పెదను. తొల్లి కృతయుగంబున సుకేతువను రాజొకఁ డుండెను. అతఁడు పుణ్యాతుఁడు. జనులను న్యాయముతోఁ బాలించువాఁడు. ఎడతెగని కలిమితోఁగూడిన వాఁడు. చతురంగ బలసమృద్ధిగలవాఁడు. అతనికి విఱివిగలకన్నులుగలదియు, వయసుగలదియు, సకలశుభకార్యములఁ జేయునదియునైన సువేది యనుభార్యగలదు. ఆపతివ్రత యాతనికిఁ దగినదై యుండును. ఆతని రాజ్యమున గ్రామము, చోరభయము లేకయుండెను. అట్లు అతఁడు రాజ్యమేలుచుండఁగా నాతనిసామంత రాజులకు ఆతనివిఁద ఓర్వ లేమిపుట్టెను. ఆసంగతి సుకేతు వెఱిఁగి, వారిపైకి యుద్ధమునకుఁ బోయెను. ఆ