కేదారేశ్వర వ్రతము
కేదారేశ్వర వ్రతము 187 గ్రహము చేత సృజింపఁబడినదో, అట్టిభగవంతునిఁ బార్వతీశ్వ ముని నమస్కరించి, సకలసంపదలును నొసఁగునట్టిదీయు, తొల్లి యనేకమునులచే నాచరింపఁబడినదియు నైన కేదార వ్రతము యొక్క మహిమను లోకముల క్షేమాభివృద్ధిఁ గోరి చెప్పు చున్నాను వినుఁడు, తొల్లి పార్వతీదేవీ యీ వ్రతము నాచరించి, సకలసంపదలను బొందెను. ఈ వ్రతంబు నాచరించువారికిని, ఈ ఈ వ్రతమహిమ విన్న వారికిని ఆయు రారోగ్య సంపత్కీర్తులు గలుగు చున్నవి. ఈయు తమవ్రతంబు నేమానవుఁ డఱువదియొక్క పర్యాయములు చేయుచున్నాఁడో, వాఁడు ఇహంబున గొప్ప యదృష్టమును, కాంతిని, ఆయుస్సును కలవాఁడై యుండి, పరలోకంబున శివసాయుజ్యము నొందుచున్నాఁడు. కావున నాలుగువర్ణంబుల వారును నియమముతోఁ గూడినవారై ఈ వ్రతంబు నాచరింపవలయును. వ్రతక థా క్రమం బెట్లనిన : భూలోకంబున ఈశాన్యమూలయందు కైలాసం బనెకి పర్వతం బొక్కటి కలదు. ఆపర్వతంబున మెఱుపులతోఁగూడిన శరత్కాల మేఘంబులో యనఁదగి సకలరత్నములతోఁగూడిన తెల్లని వెండి శిఖరములు వెలుఁగుచుండును. సొలతమాలహింతాల వకుళాశోక కరకనింబచందన దేవదారుపనసామ్రపూగపున్నాగ చంపక ప్రముఖ నానావిధ పుష్ప ఫలభరితనృక్షములతోఁ గూడి, పలు తెఱంగులగు పులుఁగులకూఁతలును, పలువిధంబులగు సెలయేళ్లును గలిగియుండును. యోగులెల్లరు నాపక్వతశిఖరమున నుందురు. అచ్చటనే యక్షకిన్న ర గంధర్వసిద్ధిచారణవిద్యాధరులు వాసము చేయుచుందురు. ఆరమ్యమైన పర్వతశ్రేష్ఠమున సర్వవ్యాపి