పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అంతరము వేచి పాకని, హంతయుఁ దత్కుక్షి సూక్ష్ముఁడై చొచ్చి సుదు
ర్దాంతపవి నేడుగనెలుగ, కాంతాగర్భంబు నఱికెఁ గడుమొఱ యిడఁగన్.

670


క.

మొఱ యిడకు మంచు నింద్రుఁడు, దొఱకొని యొకటొకటి యేడుదునుకలుగ వడిన్
నఱికె నతికోపమున ని, ష్ఠురవజ్రప్రహతి మిగులఁజోద్యము గాఁగన్.

671


వ.

ఇట్లు ఏకోనపంచాశత్ఖండంబులై యింద్రుఁడు "మారోదిహి" అని మాటి
మాటికిం బలుకుట మారుతులను నామంబుగల తీవ్రవేగులైన దేవతాభేదం
బులై యింద్రునకు సహాయులై రని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

672


చ.

మునుపు మహామునుల్ పృథుని ముఖ్యునిఁ జేసి సమస్తమేదినీ
వినుతమహాధిరాజ్యపదవి స్థితికై యభిషిక్తుఁ జేసి ర
ట్లన పరమేష్టి రాజ్యములు శ్లాఘ్యగతి న్విభజించి యిచ్చె శో
భనకరుఁడై క్రమంబునఁ గృప న్సురదైత్యభుజంగకోటికిన్.

673


క.

తారాగ్రహవిప్రులకును, సారతపంబులకు యజ్ఞసముదయమునకున్
భూరిమహౌషధులకుగా, సరసభవుఁ డధిపుఁ జేసెఁ జంద్రుని నెలమిన్.

674


సీ.

రాజులకెల్ల వైశ్రవణుని వరుణుని, జలముల కాదిత్యజాలమునకు
విష్ణుని, వసునామవిబుధులకెల్లను పావకు, సురలకుఁ బాకదమను,
దక్షుఁ బ్రజాపతితతికి, ప్రహ్లాదుని దైత్యదానవసముత్కరమునకును,
యమరాజు పితృకోటి, కైరావణము నశేషగజంబులకుఁ, బక్షిసంఘమునకు


గీ.

వైనతేయుని, నుచ్చైశ్శ్రవంబు నశ్వములకు, వృషభంబు గోగణంబులకు, భూధ
రములకు హిమాలయంబు, సింహము మృగౌఘములకు, నధిపులఁ జేసె నంభోజభవుఁడు.

675


క.

కపిలుని మునులకు, సర్పాధిపులకు శేషుని, వనస్పతితతికి ప్లక్షాం
ఘ్రిపమును నధిపులఁ జేసె, న్నిపుణుఁడు పద్మజుఁడు నైపుణీక్రియ వెలయన్.

676


సీ.

ప్రాగ్దిశయందు వైరాజప్రజాపతితనయు సుధన్వునిం ధవునిఁ జేసె
దక్షిణదిశకుఁ గర్దమపుత్రకుని శంఖపదనామధేయుని ప్రభువుఁ జేసె
ప్రత్యగ్దిశాభూమి రజుసూను కేతుమం, తుని పాలనక్రియాధుర్యుఁ జేసె
ఉత్తరదిశ కేతుమత్తనూజు హిరణ్యరోమాభిధానుని స్వామిఁ జేసె


గీ.

అంబురుహసూతి వీరిచే నఖిలధరణి, యెపుడు పాలితయగు ధర్మనిపుణలీల
వీరు భూతభవద్భవ్యవివిధపతులు, శ్రీవిభువిభూతిభూతు లూర్జితవివేక.

677


ఉ.

సారసపత్రలోచనుఁడు సర్వమయుండు తదంశసంభవుల్
గారె సమస్తపాలనకళామహనీయులు దేవదైత్యమ