ఆప్రహ్లాదునకు నాయుష్మచ్ఛిబి, బాష్కల, విరోచనులనఁ బుత్రులు గలిగిరి.
అందు విరోచనునకు బలి, బలికి బాణుండు మొదలగుపుత్రశతంబు పుట్టె. హిర
ణ్యాక్షునకు జర్ఝరుండు, శకుని, భూతసంతాపనుండు, మహానాభుండు, మహా
బాహుండు, కాలనాభుండును ననమహారథులు పుత్రులు గలిగిరి. దనువునకు
ద్విమూర్ఖుండు, శంకరుండు, అయోముఖుండు, శంకుశిరుండు, శంబరుండు,
ఏళవక్త్రుండును, మహాబాహుండు, తారకుండు, మహాబలుండు, స్వర్భానుండు,
వృషపర్వుఁడు, పులోముండు, మహాబలుడు, విప్రచిత్తియు ననఁ బుత్రులు గలిగిరి.
అందు స్వర్భానునకు సుప్రభయు వృషపర్వునకు శర్మిష్ఠయుం బుట్టిరి. ఆశర్మిష్ఠను
యయాతి గ్రహించుట చెప్పంబడియె. వైశ్వానరునకుఁ బులోమయుఁ, గాలిక
యు నన నిద్దఱుకన్యలు పుట్టిరి. వారిని మరీచి పరిగ్రహించె. వారలకుఁ బౌలో
మకాళికేయులన నరువదివేలు పరమదారుణులైన దానవులు పుట్టిరి. విప్రచిత్తి
వలన సింహకయండు వ్యసుండును, శల్యుండును, నభుండును, వాతాపియు,
సముచియు, ఇల్వలుండును, ప్రసృముండు, అంధకుండును, నరకుండును,
కాలనాభుండును, స్వర్భానుండును, వక్రయోధియు నని దనువంశవివర్ధనులైన
దానవులు పుట్టిరి. వీరలపుత్రపౌత్రు లనేకసహస్రంబులు పుట్టిరి. ప్రహ్లాదునికులం
బున నివాతకవచులు పుట్టిరి.