పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

పరమర్షిప్రవరుండు భక్తివినయభోజిష్ణుఁడై కొల్చె దు
ర్భరకారుణ్యధురీణు దానవతమోబాలార్కు శ్రీవైష్ణవో
త్కరచూడామణి రత్నవేత్ర సముదగ్రప్రస్ఫురద్బాహు శ్రీ
హరిసేనాపతి నుగ్రసేను పరమాహ్లాదంబు సంధిల్లగన్.

474


సీ.

కమనీయముఖ్య రుక్కాండంబు తుండంబు, చటులపక్షవిభూతి సామగీతి
ఆవృతయాజుషామోదంబు నాదంబు, బల మధర్వకులప్రభావఫలము
బహువిధచ్ఛందోనుబద్ధంబు స్కంధంబు, విపులనానాయజ్ఞవిధులప్రాపు
భూరివర్ణక్రమంబులు విక్రమంబులు పుచ్ఛంబు కల్పసంపూర్ణతాచ్ఛ


గీ.

మగుచుఁ జెలువొంద ఛందోమయత్వ మంది, యిందిరాప్రాణవల్లభు మందురాంత
రమున ననురలపై కాలు ద్రవ్వుచున్న, పన్నగారాతిఁ గొలిచె నప్పరమమౌని.

475


చ.

అనఘచరిత్రుఁ డమ్మునికులాగ్రణి యగ్రపథంబునందుఁ గ
న్గొనె ఘనమార్గమెల్ల నతికోమలపత్రవిచిత్రశాఖలన్
పనుపడఁ గప్పి శ్రీవిభుని మారటమూర్తి యనన్ మహాఘపా
టనపటు వైన యక్షయవటక్షితిజాతశిఖావతంసమున్.

476


సీ.

తరలిపోవకయున్న తననీడ దుస్త్యజ, బ్రహ్మహత్యాకోటిఁ బారఁదగులఁ
దరుణత్వరమ్యమౌ తనదళంబు కిశోర, పద్మనాభు ననుంగుబాన్పు కాఁగ
దృఢగతిన్ దనమహాదీర్ఘ శాఖాగ్రజా, గ్రద్విటపాలి దిక్పాలిఁ గడవ
స్థూలనిరంతరాభీలమౌ తనశిఫా, మూలజాలంబు పాతాళ మంట


గీ.

సిరుల శ్రీపూరుషోత్తమక్షేత్రసీమ, తాఁ ద్రివిక్రము నపరావతార మనఁగ
భువనవిఖ్యాతిఁ గాంచి సంపూర్ణ మహిమ, నలరునక్షయవటభూరుహంబు గొలిచి.

477


వ.

క్షేత్రరాజంబు నివాసంబు చేసి నారాయణమంత్రజపపరుండై కొంత
కాలంబునకు మోక్షసామ్రాజ్యసింహాసనాధ్యక్షుం డయ్యె.

478


చ.

కలుషవినాశకారి యగుకండుమునీంద్రుచరిత్రమున్ విని
ర్మలమహిమాభిరామ యగుమారిషజన్మము విన్నఁ గోరికల్
దలకొని చెందు సత్ఫలవితానము లూనము గాక యంచు ను
త్కలిక దలిర్పఁ జెప్పి గుణధాముఁడు సోముఁడు వారి కిట్లనున్.

479


క.

ఇల్లలన తొల్లి యొకభూ, వల్లభుసతి భర్త బాలవయసునఁ దెగిపోఁ
దల్లడిలి బాలవైధ, వ్యోల్లోలనిమగ్న యగుచు నురుదుఃఖమునన్.

480


ఉ.

పంకజనాభు భక్తపరిపాలనలాభు విభాసిశంఖచ
క్రాంకితబాహు నీరదనిభాంచితదేహు సభక్తియుక్తిహృ