పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యంబు నైమిత్తికంబు. బ్రహ్మాండంబు ప్రకృతియందు లయం బొంద నది
ప్రాకృతప్రళయంబు. యోగీంద్రులు జ్ఞానంబునఁ బరమాత్మయందు నత్యంత
లయంబు నొందిన నది యాత్యంతికప్రళయంబు. అహర్నిశంబును జంతువులు
పొందు వినాశం బది నిత్యప్రళయంబు. ప్రకృతివలని ప్రసూతి యది ప్రాకృత
సృష్టి యనంబడును. అవాంతరప్రళయపర్యంతంబును జెప్పంబడునది నైమిత్తిక
సృష్టి. అనుదినంబును సమస్తభూతంబులుం బుట్టుట నిత్యసృష్టి. అని పురాణార్ధ
విచక్షణులచేతం జెప్పంబడు. ఇట్లు సర్వశరీరంబులయందు సంస్థితుండై భగ
వంతుండును భూతభావనుండును నగుశ్రీవిష్ణుదేవుం డుత్పత్తిస్థితిసంయమం
బులు చేయుచుండు. సృష్టిస్థితివినాశంబులకు సర్వప్రాణులయందు వైష్ణవ
శక్తులు పరివర్తించు. జగంబు గుణత్రయమయంబును బ్రహ్మశక్తిమయంబును
నై యుండు. ఇ ట్లెఱింగినమర్త్యుండు పునరావృత్తి నొందఁడు.

161


ఉ.

ఆది పితామహుండు తనయంతటిపుత్రకుఁ గాంతు నంచు న
త్యాదృతి నుండ నవ్విభునియంకమునందు జనించె పుత్రుఁ డు
న్నాదుఁడు నీలలోహితుఁ డనన్ వడి నేడ్చె నతండు భీతిసం
పాదకుఁడై యుపద్రవము పాటిల సద్ద్విజవంశవర్ధనా!

162


క.

ఏమిటి కేడ్చెద వని తనుఁ, దామరసప్రభవుఁ డడుగఁ దడయక నాకున్ే
నామ మిడు మనిన రోదన, సామగ్రిన్ రుద్రుఁ డనఁగఁ జను దని పలికెన్.

163


గీ.

రోదనము మానుమనిన నారుద్రుఁ డేడుఁ, మార్లు మఱియును నేడ్వ నమ్మహితమతికి
నామసప్తక మిడియె విన్నాణ మమర, నబ్దగర్భుఁడు మౌనికులాగ్రగణ్య.

164


క.

స్థానములు నందనులు బ, త్నీనివహము గలుగఁజేసె నిపుణుఁడు వాక్కాం !
తానాథుం డెనమండ్ర, కు నానందరసార్ద్రహృదయుఁడై మునినాథా.

165


వ.

అవియును భవుండు శర్వుం డీశానుండు పశుపతి భీముం డుగ్రుండు మహా
దేవుం డన నేడునామంబులు రుద్రునకు వెలయు. సూర్యుండు, జలంబు, భూమి,
వాయువు, వహ్ని, ఆకాశంబు, దీక్షితుండగు బ్రాహ్మణుండు సోముండు ననఁ
గ్రమంబున రుద్రాదులకుఁ దనువులయ్యె. సువర్చల, ఉమ, నువికేశి, అపర, శివ,
సాహ, దీక్ష, రోహిణి యను నెనమండ్రు క్రమంబున భార్యలైరి. శనైశ్చరుండు,
శుక్రుండు, లోహితాంగుండు, మనోజవుండు, స్కందుండు, సర్గుండు, నుత్తా
నుండు, బుధుండు నన పుత్రు లైరి; దీనిపుత్రపౌత్రులచే జగంబు పూరితంబయ్యె.
ఏతత్ప్ర్పభావుండగు రుద్రుండు సతీదేవిఁ దనకు భార్యగాఁ గైకొనియుండునంత.

166