పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వథలను పదునొక్కరి
క్రమంబున భృగుండును, మరీచియు, అంగిరుండును, పులస్త్యుండును, పుల
హుండును, క్రతువును, అత్రియు, వసిష్ఠుండును, వహ్నియు, పితరులును భార్య
లగాఁ బరిగ్రహించిరి. అందు ధర్మునివలన నశ్రద్ధ కామంబును, లక్ష్మి దర్పం
బును, ధృతి నియమంబును, తుష్టి సంతోషంబును, పుష్టి లోభంబును, మేధ
శ్రుతంబును, క్రియ దండంబును, నయంబు వినయంబును, బుద్ధి బోధంబును,
లజ్జ వినయంబును, వపువు వ్యవసాయంబును, శాంతి క్షమను, సిద్ధి సుఖం
బును, కీర్తి యశంబును పుత్రులుగా గనిరి. అందు శ్రద్ధాసూనుం డగుకామంబు
వలన నంది యనుకాంత హర్షుం డనుపుత్రునిం గనియె. అతండు ధర్మునకుం
బౌత్రుండయ్యె.

156


గీ.

పరమపుణ్య! యధర్మునిభార్య యయ్యె, హింస వారిద్దఱికిఁ గలిగె నెన్ని చూడ
అనృతుఁ డనునందనుఁడు నికృత్యాఖ్యకన్య, వారలిద్దఱు మిథునమై భూరిమహిమ.

157


వ.

భయంబును నరకంబును ననునిద్దఱుపుత్రులను మాయయు వేదనయు నను
నిద్దఱుకన్యకలం గనిరి. అందు భయంబును మాయయు నరకంబును వేదనయు
మిథునంబులైరి. అందు భయంబు మాయయందు భూతాపహారియగు
మృత్యువుం గనియె. నరకంబు వేదనయందు దుఃఖం బనుపుత్రుని గనియె.
మృత్యువువలన వ్యాధిజరాశోకతృష్ణాక్రోధంబులు పుట్టె. అవి యన్నియు
నూర్థ్వరేతంబు లయ్యె. ఇవియన్నియు జగత్ప్రళయకార్యపరుండగు శ్రీవిష్ణు
దేవుని రౌద్రరూపంబులుగా నెఱుంగుము. దక్షమరీచ్యాదులగు ప్రజాపతులు
సృష్టికార్యనిర్వాహకుండగు శ్రీవిష్ణుదేవుని రాజసరూపంబులుగా నెఱుంగుము.
మనువులు మనుపుత్రులు సన్మార్గవర్తులగు నరోత్తములు జగత్స్థితికార్యనిర్వా
హకుండైన శ్రీవిష్ణుదేవుని సాత్త్వికరూపంబులుగా నెఱుంగుమని చెప్పిన
మైత్రేయుం డిట్లనియె.

158


క.

స్థితిసర్గవిలయములు ని, శ్చితగతి నిత్యంబు లనుచుఁ జెప్పఁబడియె నూ
ర్జితపుణ్య! తత్స్వరూపము, వితతంబుగ నాకుఁ జెప్పవే కృప ననినన్.

159


చ.

ప్రమద మెలర్ప నిట్లను బరాశరుఁ డుద్భవరక్షణాంతముల్
క్రమమున రూపభేదములు గైకొని చేయు జనార్దనుండు ని
త్యము మహనీయదివ్యమహిమాతిశయంబున నడ్డపాట లే
కమితవివేకపాకపరమాద్భుతభూరితరప్రభావుఁడై.

160


వ.

నైమిత్తికంబును బ్రాకృతికంబును నత్యంతికంబును నిత్యంబును నన సర్వ
భూతంబులకుఁ జతుర్విధప్రళయంబు గలదు. అందు బ్రహ్మ శయనించిన నగుప్రళ