పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

శ్రుతదేవను వృద్ధధర్మ యనుకారూశుండు పెండ్లియాడె. అయ్యంగనయందు
దంతవక్త్రుండను మహాసురుండు పుట్టె. శ్రుతకీర్తిని గేకయరాజు పెండ్లియాడె.
అయ్యంగనయందు సంతర్దనాదులు కైకయు లేవురు పుట్టిరి. రాజాధిదేవిని నవంతి
పతి పెండ్లియాడె. అయ్యంగనయందు విందానువిందు లననిద్దఱు పుట్టిరి. శ్రుత
శ్రవను జేదిపతియగు దమఘోషుండు వెండ్లియాడె. అయ్యంగనయందు శిశు
పాలుండు పుట్టె.

408


సీ.

ఆదిపూరుషుఁ డొక్కఁ డాది హిరణ్యక, శిపునామదైత్యుఁడై విపులబుద్ధి
త్రైలోక్యజనులఁ బరాభవింపఁగ రమా, ధిపుఁడు శ్రీనరసింహదేహుఁ డగుచు
విదళింప నమ్మేను విడిచి యవక్రప, రాక్రమక్రముఁడు సర్వజగదధిక
సంపత్తిధుర్యతాశ్లాఘ్యుండు నగు రావణాసురుం డయి పుట్టి వాసవాది


గీ.

సురలఁ బీడింప హరియు దాశరథి యగుచు, తలలు ద్రుంచిన దమఘోషధరణిపతికి
బుట్ట శిశుపాలుఁడై వానిఁ బట్టి చంపె, చక్రి శ్రీకృష్ణుఁడై వాఁడు చనియె దివికి.

409


వ.

భగవంతుండు ప్రసన్నుండై భక్తుని కభిలషితంబు లేవిధంబున నొసంగు నవ్వి
ధంబున నప్రసన్నుండయ్యును వధించి యభిలషితంబు లొసంగునని చెప్పి
శ్రీపరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

410


మ.

అరవిందాక్షునిచే హిరణ్యకశిపుండై రావణుండై మహా
పురుషుం డాహవభూమిఁ జచ్చి విలసద్భోగౌఘము ల్చెంది ని
ష్ణురవృత్తి న్శిశుపాలుఁడై బుధజనిస్తుత్యారిధారాహతిన్
త్వరసాయుజ్యము చెందెనంటిరిగదా ధర్మజ్ఞ చర్చింపఁగన్.

411


క.

మునుపటి రెండుభవంబుల, వనజాక్షుఁడు చంపె నపుడు వరసాయుజ్యం
బొనరక మూఁడవభవమున, నొనరుట కిది యేమి హేతు వోమునినాథా.

412


వ.

ఈయర్థంబు సమర్థింప మీరె సమర్థులని ప్రార్థించిన శ్రీపరాశరుండు మైత్రే
యున కి ట్లనియె.

413


చ.

పురుబలుఁ డాహిరణ్యకశిపుండు రణాంగణభూమి శ్రీనృకే
సరి నతిఘోరవిక్రమవిశంకటజంతువుగాఁ దలంచి భీ
కరుఁడు దశాస్యుఁ డాహవముఖంబున రాముని నొక్కమర్త్యుఁగా
గరిమఁ దలంచి ముక్తినిధిఁ గానక గాంచి రభీష్టభోగముల్.

414


వ.

ఇట్లు హిరణ్యకశిపుండు శ్రీనరసింహదేవుని జంతుమాత్రంబుగాఁ దలంచి రావ
ణుండు రామచంద్రు మర్త్యుగాఁ దలంచి కామాతురుండై జానకీసమాసక్త
చిత్తుండై మృతిం బొంది ముక్తి చేరక హరిచేతం జచ్చుట కారణంబుగా నవ్యా