పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

బలదేవునకుఁ బ్రత్యయంబైనవెనుక నీవ పరిగ్రహించెదవు గాని మణి చూపు
మనిన నక్రూరుం డవ్వేళ మణి తనవద్దన యుండుటం జేసి యిట్లని చింతించె.

396


క.

లేదని బొంకిన మాటలు, గాదని శోధించి మానికము గొను నీదా
మోదరుఁ డీదానవకుల, భేదికిఁ గీ డాచరింప భీతి యొదవదే.

397


వ.

అని నిశ్చయించుకొని యక్రూరుం డిట్లనియె.

398


గీ.

నేఁట రేపట నెల్లుండి నీరజాక్ష, నయనుఁ డడిగెడు నిచ్చెద నాకు దాఁపఁ
దరమె యని దాఁచిదాఁచి వేసరితి ననుచు, ముందటం బెట్టె మణి తనముల్లె విడిచి.

399


వ.

దివ్యరత్నప్రభాప్రభావితులై సభాసదులు సాధువాదంబుల నగ్గించి రప్పుడు
బలదేవుండు కృష్ణునకుం దనకు సమానంబైనను నమ్మణియం దభిలాషం బిడియె.
పితృధనంబు గావున సత్యభామ సకామ యయ్యె. ఇవ్విధంబు చిత్తగించి ముకుం
దుండు గాందినీనందనున కిట్లనియె.

400


సీ.

ఓదానపతి విను నుగ్రాంశుకారుణ్య, దత్తమౌ నీస్యమంతకము దాల్చు
నాతఁడు శుచియు నుద్యద్బ్రహ్మచర్యుండు, కావలె నారీతి గానివాఁడు
ధరియించెనేనియుఁ దాన నాశము నొందుఁ, గావున నిది తాల్ప నీవె తగుదు
వరయ రాముఁడు మదిరాస్వాదముఖభోగ, ములు మానలేఁడు నాకొలఁది చూడ


గీ.

షోడశసహస్రవనితలజోడు వదల, నెన్ని విధముల మేము వహింపలేము
మారుమాటాడవలదు మామనవి వినుము, సౌరమణి పూను లోకోపకారమునకు.

401


వ.

అనిన నగుంగాక యని యక్రూరుండు నిర్భయంబున మణి కంఠపథంబునం ధరించి
తేజోవిరాజమానుండై వెలింగె.

402


గీ.

జలజలోచన మిథ్యాభిశస్తిహరణ, మైనయీచరితము విన్న యనఘమతికి
జగతి నెన్నఁడు మిథ్యాభిశస్తి లేదు, పాపహరమున నగు మునిప్రవరతిలక.

403


వ.

అనమిత్రునకు శని, శనికి సత్యకుండు, సత్యకునకు సాత్యకి కలిగె. అతండ యు
యుధానుండును ననంబరఁగు. ఆసాత్యకికి సంజయుండు, నతనికిఁ గుకుణి, యత
నికి యుగంధరుడు గల్గిరి. వీరలు శైనేయులు. అనమిత్రుని యన్వయంబునఁ
వృష్ణి, వృష్ణికి శ్వఫల్కుండు గలిగె. అతనిప్రభావంబు వింటివికదా! ఆశ్వ
ఫల్కునికిఁ గనిష్ఠభ్రాత చిత్రకుండు. శ్వఫల్కునివలన గాందినియందు నక్రూ
రుండు కలిగె. మఱియును సమద్గ మృదామద విశ్వారి మేజయ గిరిక్షత్రోప
క్షత్త్ర శతఘ్నారిమర్దన ధర్మదృగ్దృష్ట ధర్మగంధ మోజవాహ ప్రతివా
హాఖ్యులు పుత్త్రులు సుతారయను కన్యకయుం గలిగె. అక్రూరునకు వేదవంతుం
గడును, నుపవేదుండును నను నిద్దఱు పుత్త్రులు కలిగిరి. చిత్రకునకు పృథు విపృథు