వారలు నహుష, క్షత్రవృద్ధ, రంభ, రజ్యసేనులను నైదుగురు. అందు క్షత్ర
వృద్ధునకు సుహోత్రుండును, సుహోత్రునకుఁ గాశ్యప కాశ గృత్సమదులను
మువ్వురుపుత్త్రులు గలిగిరి. అందు గృత్సమదునకు శౌనకుం డనం గలిగి చాతుర్వర్ణ్య
ప్రవర్తకుం డయ్యె. కాశ్యపునకుఁ గాశేయుండు నతనికి రాష్ట్రుండు కలిగె. రాష్ట్రు
నకు దీర్ఘతపుండు, దీర్ఘతపునకు ధన్వంతరి కలిగె. అతండు శ్రీనారాయణునిచేత
వరంబు వడసి కాశీరాజగోత్రపతియై యెనిమిదిప్రకారంబుల నాయుర్వేదంబు
నిర్మించె. ఆధన్వంతరికిఁ గేతుమంతుండు, కేతుమంతునికి భీమరథుండు, భీమరథు
నకు దివోదాసుండు, దివోదాసునకుఁ బ్రతర్దనుండు పుట్టె. ఆతండు భద్రశ్రేణ్య
వంశవినాశకారి యగుట శత్రుజయంబు కారణంబుగా, శత్రుజి త్తనంబరఁగె;
ఆతనికి వత్సుండు పుట్టె. ఆతండు సత్యపరుం డగుట ఋతధ్వజుం డనంబరంగె. కువల
యం బనునశ్వంబు గలుగుటం జేసి కువలయాశ్వుం డనంబరఁగె. అట్టివత్సునకు
నలర్కుండు గలిగె, నయ్యలర్కుం డఱువదాఱువేలవత్సరంబులు మనోజ్ఞ
యౌవనుండై మేదినీభాగం బనుభవించె. నయ్యలర్కునకు సన్నతి, సన్నతికి సు
నీధుఁడు, సునీధునకు సుకేతుండు, సుకేతునకు ధర్మకేతుండు, ధర్మకేతునకు సత్య
కేతుండు, సత్యకేతునకు విభుండు, విభునకు సువిభుండు, నతనికి సుకుమారుండు,