పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

వనజదళాక్షులందఱు నవారితలై చనుదెంచి యత్తపో
ధనుని వరించు టెల్ల విశదంబుగ వర్షధరుండు చెప్ప న
జ్జనపతి యంతరంగమునఁ జాలవిచారము నొంది కొంతప్రొ
ద్దున కొకతీరు సమ్మతముతో శమితోత్సవలీల నున్నెడన్.

76


క.

మంగళసమాచరణ మొక, భంగి న్నడచుటయు నంతఁ బ్రతిభాన్వితుఁడై
యంగనలఁ దోడుకొని ముని, పుంగవుఁ డరుదెంచె నిజతపోవనమునకున్.

77


వ.

అచ్చటికి నశేషశిల్పకల్పనానల్పశర్మయగు విశ్వకర్మ రావించి తన
మనోవర్తనం బెఱిఁగించిన నతండును నొక్కొక్కకాంతకుఁ బ్రోత్ఫుల్లపంకజ
కూజత్కలహంసకారండవాదిజలవిహంగమాభిరామజలాశయసంచ
రన్మందపవనంబులగు నుపవనంబులును, సోపధానసావకాశసాధుశయ్యా
పరిచ్ఛదసప్రసాదంబులగు మణిప్రాసాదంబులు నిర్మించి చనిన నమ్మునీంద్రుం
డందు నిరపాయబహువిధనిధిసంపదల నావహించిన ననవరతభక్ష్యభోజ్య
లేహ్యాద్యుపభోగంబులచేతను ననేకభృత్యానీతకుసుమచందనభూషణాం
బరాదులచేతను నిరంతరం బాకాంతలు సకాంతలై యనుభవించుచుండి
రంత కొంతకాలంబు చనిన.

78


శా.

మాంధాతృక్షితిపాలశేఖరుఁడు శుంభత్పుత్రికాస్నేహసం
బంధం బాత్మఁ గలంప వృద్ధముని యేఁబండ్రం జలం బేర్పడన్
సంధాబంధురుఁడై వరించి నిజవన్యాభూమికిం బోయె ని
ర్బంధం బయ్యెఁ దనూభవామణులకుం బ్రాక్కర్మదౌష్ట్యంబునన్

79


గీ.

హారివస్త్రాన్నపురసౌధవారసార, తూలతల్పంబు లొందు నాదుహితలకును
నారచీరలువ న్యాశనము లటవు, లుటజములు భూమిశయ్యలు నొదవె నకట.

80


వ.

అని చింతించి యత్తపోధనవర్యుని యాశ్రమంబునకు వచ్చి యతిరమ్యోప
వసజలాశయంబును స్ఫురదంశుమాలాజటిలంబును నగు ప్రాసాదమండ
లంబు చూచి యందొక్కప్రాసాదంబు ప్రవేశించి తనూజం జూచి యాలింగ
నంబు చేసి కృతాసనపరిగ్రహుండై హర్షాశ్రువులు దొరుగ నిట్లనియె.

81


గీ.

అమ్మ సౌఖ్యంబు కలదె మహామునీంద్రుఁ, డెలమిఁ జనవచ్చునే మమ్ము నెప్పుడైనఁ
దలఁతువే యాత్మలో నన్నఁ దండ్రిపలుకు, విని తనూభవ పలికె సద్వినయమునను.

82


మ.

మునిశార్దూలుని సత్కృపామహిమ సొము ల్చీర లాస్వాదవ
ద్వినుతాన్న౦బు లుదారగంధసుమనోవీటీపటీరాదు లిం