పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

రైవతుఁ డాత్మపుత్రికిఁ గరగ్రహణార్థము రాజపుత్రుఁ డీ
భూవలయంబునందుఁ దలపోయఁగ నెవ్వఁడొకో యటంచు నా
రేవతిఁ దోడుకొంచు నిబిరీసగతి ప్రతిభాప్తిఁ బోయె రా
జీవభవాలయంబునకుఁ జిత్తము తత్తరపాటు నొందఁగన్.

26


వ.

ఇట్లు సత్యలోకంబునకుం బోయి తదంతికంబున హాహా హూహూనామ
గంధర్వు లతిరాగంబున దివ్యగానంబు చేయ వినుచుండె. అదివ్యగానంబు
శ్రీమార్గపరివృత్తం బైనను ననేకయుగపరివృత్తం బైనను ముహూర్తంబుగాఁ
దలంచుచుండి గీతావసానం బయిన నబ్జయోనిం గని సాష్టాంగనమస్కారంబు
చేసి యిక్కన్యకు యోగ్యుండైన వరుం డెవ్వరని యడిగిన రైవతునకుఁ జతు
రాననుం డిట్లనియె.

27


గీ.

వసుధ నీకు మనసు వచ్చిన యల్లుఁడే, పగిదివాఁ డటన్నఁ బార్ధివుండు
మ్రొక్కి స్వామిచి త్తమునకు వచ్చినవాఁడె, వనజముఖికి యోగ్యుఁ డనుచుఁ బలికె.

28


సీ.

వనజగర్భు డొకింతవడి విచారించి, భూపాగ్రణిఁ జూచి యిట్లనియె నీవు
తలఁచినవారిసంతతులు సపుత్ర, పౌత్రాదిగా వనుధపై నణఁగిపోయె
గానంబు వినుచుండఁగా బహుకాలంబు, పోయె నిప్పుడు భూమిఁ బొడమఁ గలిగి
యున్నది కలియుగం బిన్నలినాక్షి నెవ్వరి కిచ్చెదవు బంధువర్గకోశ


గీ.

బలము లెవ్వియు లేవు నీ కిల నటన్న, సాధ్వసము నొంది యారాజు జలజభవుని
కనియె “నిక్కన్య నింక నెవ్వనికి నిత్తు", ననినఁ దల వంచి మనసులో నరసి యజుఁడు.

29


వ.

నీ విచ్చటికి వచ్చినవెనుక నష్టావింశతిచతుర్యుగంబులు చనియె నని పలికి
యేకాగ్రమనస్కుఁడై సప్తలోకగురుండగు నంభోజయోని గృతాంజలియగు
రాజున కిట్లనియె.

30


సీ.

ఎఱుఁగలే మెప్పుడు నేజగన్మయుని, స్వభావస్వరూపసంపద్బలములు
కళమొదల్ యుగచర్య కడపలగాఁ గల, కాల మేవిభుభూతిఁ గడప లేదు
సృష్టిరక్షణనాశకృత్యార్థ మేదేవు, వలన మూర్తిత్రయం బెలమిఁ గలిగె
శక్రాదిరూపియై సకలలోకంబులు, పాలించు నేపరాత్పరుఁడు నియతిఁ


గీ.

జంద్రసూర్యాకృతులు దాల్చి జగతితమము సకలమును బాఱఁద్రోలు నేస్వప్రకాశుఁ
డగ్నిపవనాంబువియదవన్యాత్ముఁ డెవ్వఁ, డట్టిసర్వేశుఁ డవతార మయ్యె నపుడు.

31


వ.

జగంబులు తానయై గలుగఁజేసి రక్షించి త్రుంచునట్టి శ్రీవిష్ణుదేవుం డిప్పుడు
నిజాంశంబున నవతరించి మీకుశస్థలి ద్వారక యను పట్టణంబుగా నందు బల