పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

సార్వభౌమ! యమావాస్య స్వాతితోడ, మైత్రితోడ విశాఖతోఁ జిత్రలీలఁ
గూడువేళల శాద్ధంబు గోరి చేయఁ, దృప్తి పితరుల కష్టవార్షికి జనించు.

228


చ.

పొలుపగు కృష్ణపంచదశిఁ బుష్యపునర్వసు రౌద్రతారలం
గలసినవేళ మానవుఁ డకంపితయై తగుశ్రద్ధ శ్రాద్ధ ము
త్కళిక నొనర్పఁ దృప్తియగు ద్వాదశవత్సరముల్ పితృవ్రజం
బులకు నృపాలచంద్ర! యిది పూనికతో నొనరింపఁగాఁదగున్.

229


గీ.

వరుణతారతోడ వాసవతారతోఁ, బూర్వభద్రతోడఁ బొసఁగఁ గూడి
యున్నతత్వ మమర నున్నయమావాస్య, దేవదుర్లభంబు భూవరేంద్ర.

230


వ.

ఈతొమ్మిదినక్షత్రంబులతోఁ గూడిన యమావాస్యయందు శ్రాద్ధంబు చేసినఁ
బితృతృప్తి యగునని చెప్పి యౌర్వుండు సగరున కిట్లనియె.

231


చ.

ఘనపితృభక్తి వైభవము గల్గు నిలాసుతుఁడౌ పురూరవుం
డనఘ సనత్కుమారుఁ గని యాదృతి వేఁడిన నమ్మునీంద్రుఁ డా
జనపతిఁ జూచి కౌతుకవశంవదుఁడై యెఱిగించె నట్లు స
ద్వినుతవచోర్థ మీవును బ్రవీణతతో వినుమంచు నిట్లనున్.

232


వ.

భాద్రపదమాసంబునఁ గృష్ణపక్షత్రయోదశియందును, మాఘమాసం
బున నమావాస్యయందును, సూర్యసోమగ్రహణకాలంబులయందుఁ ద్ర్యష్ట
కలయందును, నయ నద్వయంబునందును బితరుల నుద్దేశించి శ్రద్ధాసమన్వి
తుఁడై తిలోదకంబులనైన నీయవలయు, శ్రాద్ధంబు చేసెనేని సహస్రసం
వత్సరతృప్తి యగును.

233


గీ.

మనుజనాథ వినుము మాఘంబునం దమా, వాస్యఁ గూడెనేని వరుణతార
యదియె పితలకును మహాపుణ్యకాలంబు, పరమభాగ్య మదియె దొరకెనేని.

234


వ.

అమ్మాఘామావాస్యయును, సూర్యగ్రహణకాలంబును ధనిష్ఠతోఁ గూడిన
నందుఁ బితరుల నుద్దేశించి శ్రాద్ధంబు చేసిన నయుతకులంబులతోఁ బిత
లు తృప్తినొందుదురు. ఆయమావాస్య పూర్వభాద్రతోఁ గూడిన నందు
శ్రాద్ధంబు చేసిన బితలు యుగపర్యంతబును దృప్తినొంది సుఖింతురు.
గంగ, శతద్రువు. విపాశ, సరస్వతి, నైమిశంబు, గోమతి, గోదావరి యనుని
మ్మహానదుల నవగాహించి పితల నుద్దేశించి శ్రాద్ధంబు చేసినఁ బాపంబులం
బాయుదురు.

235


చ.

అనుపమ మాఘమాసమున నర్థి సమాతిథియందుఁ దోయ మై
నను దనయాదు లిచ్చిన మనంబునఁ దృప్తులమై సుఖింతు మం