పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నలుగనటన్న రా జనియె నల్లదె పల్లకీదండె మూఁపుపై
బలుపిదె మేన నీ కిపుడు భారము మోచిన శ్రాంతి పుట్టునే.

214


వ.

అనిన బ్రాహ్మణుం డిట్లనియె.

215


గీ.

భూపవర యిప్పు డీ వేమి పోలఁ గంటి, వది యెఱిగింపు పిదపఁ జెప్పెదవు గాని
బలవదబలవిచారనిష్పాదితార్థ, మంతయను సూక్ష్మబుద్ధిచే నాకలించి.

216


ఉ.

పల్లకి మోచినాఁడ విదె పాయదు మూఁపున దండెయంచు నీ
వెల్లరు వీనుల న్వినఁగ నిప్పుడు పల్కితి రంతయు న్మహీ
వల్లభ కల్ల సుమ్ము విను వాంఛ జనించినయేని చెప్పెదన్
దెల్లము గాఁగ నీదగు మనీష తిరంబుగఁ జేయు మేర్పడన్.

217


సీ.

వసుధపై పాదము ల్వానిపై జంఘలు వానిపై నూరులు వానిపైని
కడు పందుమీఁద వక్షమ దానిపై బహు లామీఁద స్కంధంబు లమరియుండు
స్కంధాశ్రితము శిబికాదండ మిట్లౌటఁ బ్రకటింప నాకు భారంబు కలదె
శిబికపైఁ ద్వదుపలక్షితశరీరము నిల్చె నిన్నును నన్నును నున్నదాని


గీ.

భూతములు మోచు నంతియె భూమిపాల, యవియు నడుచు గుణప్రవాహమునఁ దగిలి
గుణములును గర్మవశ్యతఁ గూరుఁ గర్మ, సమితియు నవిద్యఁ గలుగు నిజంబు సుమ్ము.

218


వ.

ఆత్మశుద్ధుం, డక్షరుండు, శాంతుండు, ప్రకృతికంటెఁ బరుండు, వృద్ధిక్షయ
రహితుండు, అఖిలజంతువులయందు నొక్కరుండై యుండుటం జేసి.

219


క.

బలుపును దరుగును నెఱుఁగక, కలకాలము నొక్కతీరుగా నుండంగా
బలిసితివనియును నన్నున్, బలికితివది యేమియుక్తిఁ బలికితి చెపుమా.

220


వ.

భూమిపాదజంఘాదులకు నాకు శిబికాభారంబు సమంబ శిబికాభారంబు
భూతంబులు వహించుంగాని జంతువులు కావు శిబికయు భూతసంగ్రహంబు,
అదియు మమత్వావబృంహితంబై భ్రాంతిఁ గొలుపునని పలికి యమ్మహాను
భావుం డూరకుండిన.

221


క.

నరపతియును శిబిక యతి, త్వరితగతిం డిగ్గనురికి తచ్ఛ్రీపాదాం
బురుహముల కెరఁగి నిటలాం, తరమున నంజలి ఘటించి నమ్రతఁ బలికెన్.

222


క.

విడువిడుఁడు శిబిక నే మీ, యెడ త ప్పొనరించినాఁడ నెఱుఁగక నన్నున్
గడలేనికరుణతో ని, ప్పుడు గావఁగవలయు భువనపూజితచరితా.

223


క.

నీ వెవ్వ రేమిటికిఁగా, నీవిధమున నుండవలసె నేమిపనికిఁగా
రావలసె నిటకుఁ జెప్పుము, కోవిదనుత యనిన విభునకు న్ముని పలికెన్.

224