అందుఁ బ్రథమంబు సంవత్సరంబు, ద్వితీయంబు పరివత్సరంబు. తృతీయంబు
ఇవ్వత్సరంబు చతుర్థం బనువత్సరంబు. పంచమంబు వత్సరంబుగా నిట్లు
ప్రభవాది పంచవర్షంబులు సౌర, చాంద్ర, నక్షత్ర, సావనమాస వికల్పితం
బులై యుగ మనం బరఁగు. ఈభూమండలంబునకుఁ గడపలదైన లోకా
లోకశైలంబునకు దక్షిణంబును, నుత్తరంబును, వైషువంబును నన మూఁడు
శృంగంబులు గల వందు మేషతతులయందు మార్తాందుండు వైషువతీశిఖరం
బున నుండ దివారాత్రంబులు సమంబుగా నడచు. ఆసమకాలంబు విషువ
కాలం బనం బరంగి పుణ్యకాలం బయ్యె. అందు దేవ, పితృదానంబులు చేసి
కృతకృత్యు లగుదురు. శుక్లపక్షాంతంబు పౌర్ణమాసి యనం బరఁగు. కృష్ణ
పక్షంబు అమావాస్య యనం బరఁగు ఆపౌర్ణమాసికి రాకయు ననుమతి
యును, అమావాస్యకు, శిరవాలియు, కుహువు నను నామాంతరంబులు
కలవు. మాఘఫాల్గుణంబులును చైత్రవైశాఖంబులును జ్యేష్టాషాఢంబు
లును, శిశిరవసంతగ్రీష్మఋతువులు మూఁడు నుత్తరాయణంబు. శ్రావణ
భాద్రపదంబులును ఆశ్వీజకార్తికంబులును మార్గశీర్షపౌష్యంబులును
నను వర్షాశరద్ధేమంతఋతువులు మూఁడును దక్షిణాయనం బనం బరఁగు.