పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నకు పుష్కరద్వీపంబును ఇచ్చి యభిషిక్తులం జేసె. అందు జంబూద్వీ
పేశ్వరుండైన యగ్నీధ్రునకు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య,
హిరణ్వత్తు, కురు, భద్రాశ్వకేతుమాలులను తొమ్మండుపుత్రకులు ప్రజా
పతిసములు పుట్టిరి. అగ్నీధ్రుండు జంబూద్వీపంబు తొమ్మిదిభాగంబులుగా విభ
జించి నాభియను నగ్రపుత్రునకు దక్షిణంబైన హిమవర్షంబును, కింపురుషు
నకు హేమకూటంబును, హరివర్షునకు నైషధవర్షంబును, ఇలావృతునకు మేరువు
చుట్టున మేరువర్షంబును, రమ్యునకు నీలాచలవర్షంబును, హిరణ్వంతునకు ఉత్త
రంబైన శ్వేతవర్షంబును, కురువునకు శృంగపర్వతోత్తరవర్షంబును, భద్రాశ్వు
నకు మేరుపూర్వవర్షంబును, కేతుమాలునకు గంధమాదనంబును నొసంగె.

6


క.

ఈమాడ్కి నమ్మహీపతి, భూమీభాగముల కాత్మపుత్రుల రాజ
శ్రీ మించఁ జేసి సాలగ్రామాశ్రమమునకుఁ దపము గైకొనఁ జనియెన్.

7


సీ.

మునికులచంద్ర కింపురుషాభిధేయాష్టవర్షంబులందు సర్వసుఖసిద్ధు
లప్రయత్నంబున నావిర్భవించు, విపర్యయంబును జరాభయము మృత్యు
భయము నధర్మసంభవమును ధర్మసంభవమును లేదు వీడ్వడగ నుత్త
మాధమమధ్యమవ్యవహారములు యుగవ్యాపారములు గల్గ వందు నెపుడు


గీ.

దేవలోకసమములై వెలుగొందుచు, భోగభూము లగుచు పొగడు గనుచు
నధికమహిమ వెలయు నయ్యష్టవర్షంబు, అధివసింతు రచట ననఘమతులు.

8


క.

హిమవర్షపతికి నాభికి, నమితద్యుతి మేరుదేవి యను కామినికిన్
కమలాక్షునిభుఁడు ఋషభుఁడు, కుమారుఁ డుదయించె జగము కొనియాడంగన్.

9


వ.

రుషభుండు తండ్రిపరోక్షంబున హిమవర్షంబునకు రాజై రాజధర్మం బవల
బించి వివిధాధ్వరంబు లొనరించె. అతనికి భరతజ్యేష్ఠంబైన పుత్రశతం
బు గలిగె. అందు జ్యేష్టపుత్రుని భరతు హిమవర్షంబునకు నభిషిక్తునిం జేసి,
రుషభుండు పులహాశ్రమంబునకుఁ బోయి, యచ్చట వానప్రస్థధర్మంబునఁ
దపం బొనర్చుచు యథార్హయజనశీలుండై యోగమార్గంబున నుత్తమ
లోకగతుఁడయ్యె.

10


క.

ధీఁరుడు భరతుం డేలగ, భారత మన ధరణిఁ బేరుపడి హిమవర్షం
బారూఢి కెక్కె నతనికి, సూరివరా! ధార్మికుండు సుమతి జనించెన్.

11


వ.

సుమతిం బట్టాభిషిక్తుం జేసి భరతుండు సాలగ్రామాశ్రమంబున యోగాభ్యా
సరతుండై ప్రాణంబులు విడిచి శ్రేష్ఠంబైన యోగికులంబున విప్రుండై జని
యించె. మైత్రేయా! పదంపడి తచ్చరితంబు చెప్పెద; భరతపుత్రుండైన