పుట:విక్రమార్కచరిత్రము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33


ప్తునిఁ దగురీతి వీడుకొని, భూపతిపాలికిఁ బోయి పూసగ్రు
చ్చినగతిఁ గార్యనిర్ణయ మశేషము తిన్నగ విన్నవించినన్.

145


మదనరేఖను బెండ్లాడుమని రాజు చంద్రగుప్తు నర్థించుట

చ.

విని కడుసంభ్రమించి యతి వేగమ కంచుకిఁ బంచి చంద్రగు
ప్తునిఁ బిలిపించి, యాదరముతోడ సమున్నతనూత్నరత్నకాం
చనమయరమ్యపీఠ మిడి, సారగభీరవచోనిరూఢి నొ
య్యన వినయంబు తేటవడ నమ్మనుజేంద్రకులేంద్రుఁ డిట్లనన్.

146


ఆ.

నిరుపమానమైన నీ మోహనాకార
రేఖ చూచె మదనరేఖ యనుచు
నదియ తప్పుచేసి, యలరంపగము లేసి
యలఁతఁబెట్టఁ దొణఁగె నంగభవుఁడు.

147


క.

మరుచే దొడిఁబడకుండఁగఁ
గరుణింపు, సరోజనేత్రఁ గావు, ‘మహింసా
పరమోధర్మ’ యనం గల
పరమార్థనిరూపణంబు భావించి మదిన్.

148


వ.

అనవుడు నబ్భూసురుండు.

149


మ.

సచ్చరితానువర్తనము సాధుజనంబులు సమ్మతింపగా,
నచ్చపుబ్రహ్మచర్యము ప్రయత్నమునం జరియించుచుండి, నేఁ
దొచ్చెల శూద్రఊామినికి నువ్విళులూరి పథంబు దప్పఁగా
వచ్చునె తెడ్డునాకి యుపవాసము మాన్పికొనంగ నేటికిన్?

150


క.

వర్ణాశ్రమధర్మంబుల
నిర్ణయములు దొఱుఁగకుండ నియమించు యశః
పూర్ణులు, మీరలె యీయది
నిర్ణయమని పలుకఁ దగునె నిండినసభలోన్?

151


వ.

అనిన నమ్మహీశ్వరుం డిట్లనియె.

152