పుట:విక్రమార్కచరిత్రము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


దొరయునె యీప్రసూనములతో నితరప్రసవవ్రజంబు నాఁ,
బురమునఁ బద్మషండములు పొల్పెసలారు మనోహరంబులై.

92


సీ.

కామశాస్త్రంబులు వేమాఱు నియతిమైఁ
        జదువకుండినఁ బుష్పశరునియాన
మన్మథాగమములమర్మంబు లెల్లను
        జూడకుండిన రమాసుతునియాన
సూనాస్త్రతత్త్వవిజ్ఞానంబు గడముట్టఁ
        గనుఁగొనకున్న నంగజునియాన
మకరకేతనమంత్రసుకరాక్షరము లను
        ష్ఠింపకుండిన మనసిజునియాస


తే.

యనుచు, జనులెల్ల వినఁ జాటుననువు దోఁవ
మత్తకోకిలనిస్వన మధురకీర
భాషణంబులు వీనులపండు వగుచుఁ
దనరుఁ దత్పురి నుపవనాంతరములందు.

93


ఉ.

చిత్తజురాజ్యసంపద యశేషము గైకొని సౌఖ్య మందఁగా
[1]నుత్తులు దార నాఁ బురవరోపవనంబులు సొచ్చి యిచ్చఁ బూ
గుత్తుల వ్రాలి, తేనియలు కుత్తుగబంటిగఁ గ్రోలి, లీలమై
నొత్తిలి మ్రోయు చింపుదళుకొత్తుచు నుండు మదాలిదంపతుల్.

94


సీ.

విరజాజివిరులపై విహరించు విహరించి
        సొబగు నెత్తావులు చూఱలాడు
బొండుమల్లియలపైఁ బొరలాడుఁ బొరలాడి
        పుష్పంధయంబులఁ బోవఁజోపుఁ
గన్నె గేదఁగు లొయ్యఁ గదలించుఁ గదలించి
        చదలఁ బుప్పొడి వెదచల్లియాడు
జలజ వనంబులోఁ జరియించుఁ జరియించి
        దొరఁగు పూఁదేనెలఁ దొప్పఁదోఁగు


తే.

సతతబహువిధరతపరిశ్రాంతి నొంది
యున్నవనపాలదంపతు లొడల నున్న

  1. అర్హులు