పుట:విక్రమార్కచరిత్రము.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

విక్రమార్కచరిత్రము


క.

చనఁ దలఁచిన మన మనుపఁగఁ
జన నొప్పదె తనకు, నిట్టి చలచిత్తునిపై
ననుపమసేనాన్వితముగఁ
జని క్రమ్మఱఁ బట్టి తెమ్ము సమ్ముఖమునకున్.

77


వ.

అనిన విని నీతిధ్వజుండు యుద్ధసన్నద్ధాఖిలసేనాసమన్వితుడై, యాప్రొద్దె కదలి హేమాంగదుండు చనినజాడ యరసి యతిత్వరితగతిం జని కూడముట్టిన, నాభీలంబైన యాకలకలం బాలించి కామమంజరీకాంత నలుదిక్కులం బరికించి, పడగలయడియాలంబులు నిరీక్షించి నిజజనకు సేనాసంకులంబుగా నిశ్చయించి, తనపతినిద్రాభంగంబు గాకుండ నతనియుత్తమాంగంబున కుపధానంబుగా నొక్కపరిధానంబు చుట్టి పెట్టి , తలచీర యాయితంబు చేసికొని సంగరోత్సాహం బంతరంగంబునం బొంగ, సన్నద్ధసర్వాయుధం బైనయింద్రాయుధంబు నారోహణంబు చేసి, ప్రాణేశ్వరచరణస్మరణపరిణతాంతఃకరణ యగుటను రణవిహరణంబు తృణకణాయమానంబుగా గణించుచు, విటవిటపి కనతిదూరంబున వచ్చుచున్న తత్ప్రబలవాహినిలోనికి నిజవాహనంబు నుఱక తఱియం బఱసి.

79


కామమంజరి యుద్ధవర్ణనము

మ.

మదదంతావళదంతముల్ నఱకు నమ్మావంతు లుద్భ్రాంతతన్
బెదరం, బల్లము గుఱ్ఱమున్ రవుతును వేటాఱుతుండెంబులై
చెదరంగా వడి వ్రేయు, వీరరధికశ్రేణిన్ బలౌఘంబులం
గుదియం జేయు, భటాలిఁ ద్రుంచు విలసద్ఘోరాసిధారాహతిన్.

79


చ.

ప్రతిబలవార్థి బాడబముభంగి దహించును, రాముపోలికన్
శితశరధార పాల్పఱుచుఁ, జెల్లెలికట్టయుఁబోలెఁ బాఱనీ
కతులితలీల నాఁగు మునియచ్చునఁ బొంకమణంచు, మందగ
క్షితిధరవృత్తిమైఁ గలఁచుఁ జిత్రముగా లలితాంగి యుక్కునన్.

80


క.

సరి నాధానము సేయుట
యరిఁబోయుట తివియు టేయు టద్భుతకరమై