పుట:విక్రమార్కచరిత్రము.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

185


నిది మఖాగతులకు నీఁదగియెడు నూత్న
        బహురత్నభూషణాంబరము లొసఁగు


తే.

ననుచు నీనాల్గుమణులను నంబురాశి
పావడంబుగ నాచేతఁ బనిచె మీకుఁ
దానువచ్చినయట్లుగాఁ దలఁపు మనుచు
విన్నపము సేయుమనుచును వేడ్కతోడ.

115


క.

అని పురుషార్థచతుష్టయ
మన నొప్పెడు మణిచతుష్టయము నిచ్చుటయున్
మనుజాధిపుఁ డావిప్రుని
గనుగొని యిట్లనియె వినయగౌరవ మెసఁగన్.

116


ఉ.

అప్రతిమానలీల నొకయాగము నీవును నాచరింపు లో
ప్రథమానకీర్తి యెసకంబుగఁ గైకొనుమంచు నిచ్చె న
వ్విప్రకులాగ్రగణ్యునకు విశ్రుతపుణ్యునకుం గృపావిశే
షప్రతిపత్తితో నమృతసాగరదత్తవినూత్నరత్నముల్.

117


క.

ఇచ్చిన మునులును నృపతులు
నిచ్చలఁ గడు మెచ్చి మెచ్చి యీయౌదార్యం
బెచ్చటను వినఁగఁజూడఁగ
నచ్చెరు వని ప్రస్తుతించి రాసమయమునన్.

118


వ.

ఆనవరదాహూయమానాగ్నిభట్టారకుండైన వరరుచిభట్టారకుండు చనుదెంచి యజనవాసరం బాసన్నం బగుటయుఁ బ్రసంగించి శకాంతకునకు నిట్లనియె.

119


సీ. మున్ను నీభండారమున నున్న బహురత్న
        కాంచనావళు లసంఖ్యములు గలవు
సతతంబుఁ గంధానుసంధీయమానంబు
        లగుమాడలు గణింప నలవి గాదు
నృపులచే భట్టి కానికలు దెచ్చినసొమ్ము
        కొలఁది యెవ్వరికి వాక్రువ్వ రాదు