పుట:విక్రమార్కచరిత్రము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

53


చిత్రంబుగఁ దదీయసూత్రంబు లైదును
        ఘోరాసిచేఁ ద్రెవ్వం గోసి వైచి


తే.

యాజలాశయమధ్యంబునందు నున్న
యుగ్రశూలాగ్రమునఁ బడనోపువాఁడు
సకలసామ్రాజ్యవైభవోత్సవము నొంది
తత్పురం బేలు, నిది దేవతావరంబు.

44


క.

ఇది శిలవ్రాసినయది యని
[1]చదురున విప్రుం డొకఁడు ప్రసంగవశమునం
జదివెను నొగి నీపద్యము
నది యెఱుఁగఁగ వలయు, నచటి కరిగెద భట్టీ!

45


తే.

ఉట్టిచేరులు గోయంగ నుత్సహించి
యొకటి దెగఁగోసి వెండియు నొకటిఁ గోయ
మునుపుగోసినయది యంటుకొనుచునుండు
ననును విన్నార మిట్టిచోద్యములు గలవె!

46


క.

అన సుమతిసూనుఁ డిట్లను
జననాయక దీనికై విచారం బేలా?
విను ముట్టిచేరు లొక్కటఁ
బెనుపొతముగఁ గోయరాదె ప్రిదులక యుండన్.

47


ఉజ్జయిని కేగి కాళిని మెప్పించి విక్రమార్కుఁడు వరము పొందుట

మ.

అనినం దత్ప్రతిభావిశేషమున కత్యాశ్చర్యముం బొంది, య
మ్మనుజాధీశుఁడు భట్టిఁ జంద్రపురిసామ్రాజ్యంబున న్నిల్పి. భూ
జనసంరక్షణమార్గసమ్యగుపదేశం బిచ్చి, తా నేగె ను
జ్జనికిన్ సమ్మతిఁ బాదుకంబువలనన్ సంతోషితస్వాంతుఁడై.

48


వ.

అరిగి యనేక ప్రసూనసుగంధవహబంధురోపవనాపాదితసముత్కరంబయిన యన్నగరోపకంఠంబున.

49
  1. చతురత. వా. 1926.