పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

61


బావనత నొందెనని యా
భూవరుఁ గని శాంతవచనముల ని ట్లనియెన్.

138


వ.

మద్వాక్యంబులకుం దగినయుత్తరంబులు నీవునుం జెప్పుదు గాక యన
వుడు నా నృపాలుండు కర్కటి కి ట్లనియె.

139


సీ.

జగములు లేమి నిశ్చయముగాఁ దెలిసిన
        నేదేవుసుజ్ఞాన మెపుడు వెలుఁగు,
నఖిలసంకల్పసంన్యాసంబు చేసిన
        నేదేవు మనములో నిడగ వచ్చు,
మెఱసి యే దేవుని మీలనోన్మీలనం
        బుల సృష్టి యణఁగుచుఁ బొడముచుండు,
నఖిలవేదాంతవాక్యములకు నిష్ట మౌ
        నందాఁక నేదేవుఁ డతిశయిల్లు,


గీ.

గోటికోట్యంతరంబులఁ గొమరు మిగిలి
దృష్టివిషయంబు గాక యేదేవుఁ డమరుఁ,
దివిరి సచరాచరంబు లేదేవు లీలఁ
బరఁగి వర్తిల్లు, నది పరబ్రహ్మ మబల.

140


గీ.

వెలయ విశ్వాత్మకుఁడు నాఁగ విశ్వములును
దాన యయ్యును నొక్కటై తనరు నట్టి
శాశ్వతబ్రహ్మచిన్మాత్రసత్యవాక్య
ఫణితి నీచేత వినఁ గంటి పద్మనయన.

141


వ.

అని చెప్పుటయు.

142


క.

వెన్నెలఁ గన్న కుముద్వతి
చెన్నున మేఘంబుఁ గన్న శిఖిగతి మదిలోఁ
దన్నెఱుఁగని సంతసమున
నన్నరపతిఁ గాంచి దనుజ యలరుచుఁ బలికెన్.

143