పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

వాసిష్ఠరామాయణము


సుప్తుఁ డగువాని బుద్ధి విస్ఫురణభంగిఁ
జేసియును జేయకుండుదుఁ జేయుపనులు.

159


క.

గురువాక్యము శాస్త్రార్థముఁ
బొరిపొరిఁ జిత్తానుభవముఁ బొందించి నిరం
తరమును నైక్యాలోకన
పరుఁ డగునభ్యాసి పొందుఁ బరతత్త్వంబున్.

160


గీ.

అల్పసంస్కృతమానసు లైనవారి
కైన మది మౌర్ఖ్య - మెడలించునట్టిశాస్త్ర
మిదియ తప్పంగ మఱి యన్య మెద్ది గలదు?
వినుము తత్పరబుద్ధివై మనుజనాథ.

161


క.

ధనమును గాయక్లేశముఁ
దసమిత్త్రులు తీర్థదేవతాసేవలు నెం
దును దత్త్వము నొందింపవు,
మనము నిరోధింపకున్న, మనుకులతిలకా.

162


క.

విను మోక్షద్వారపదం
బునకు శమంబును విచారమును సంతోషం
బును సాధుసంగమంబును
ననునాలుగు ద్వారపాలకాభిదము లగున్.

163


వ.

అవి యెయ్యవి యంటేని.

164


గీ.

దోషములు దుష్క్రియాదులు దుస్సహంబు
లైనదుఃఖంబు లెల్లను నాక్షణంబ
శాంతి మది నూనుమాత్రన సమసి పోవు,
నర్కుఁ డుదయింపఁ జీఁకటి యణఁగునట్ల.

165


క.

వినునెడఁ గనుఁగొనునెడ మూ
ర్కొనునెడ ముట్టునెడఁ జవులు గొనునెడ మేల్గీ