పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31


డును వచ్చినపుడు మోదం
బును ఖేదము లేనియుత్తముఁడు శాంతుఁ డగున్.

166


గీ.

పొలుచు వేడుకఁ బెండ్లికిఁ బోవునపుడు
నుగ్రు లై చంపఁ గొనిపోవు చున్నయెడల
చిత్త మెంతయుఁ జల్ల నై శీతకరుని
చందమున నున్నయాతండు శాంతుఁ డండ్రు.

167


గీ.

తాపసులయందు శాస్త్రవిత్తములయందు
యాజకులయందు నృపులందు నతిబలాఢ్యు
లందు శమయుక్తుఁ డగువాఁడ యధికుఁ డెందు;
నని యెఱుంగుము మనమున మనుకులేశా.

168


గీ.

వినుము శాస్త్రావబోధచే విస్తరిల్లి
పూతమును నిర్మలము నైనబుద్ధిఁ జేసి
కారణ మెఱింగి యాత్మవిచార మాత్మఁ
దవిలి సేయుచు నునికి కర్తవ్య మనఘ.

169


గీ.

అంధకారంబునందును నణఁగి పోదు,
దీపతేజంబునందును దిరిగి రాదు,
ఎట్టిమఱు వైనఁ గన్పించు నెదురులేక
చారుతర మైనయట్టి విచారదృష్టి.

170


క.

'ఏ నెవ్వఁడ? సంసారా
ఖ్యానం బీదోష మెట్లు గలిగెనొ?' యనుచుం
దా నిజయుక్తిం దెలియుట
వూని విచారంబు నీకె పో రఘువీరా.

171


క.

సంతోషము సుఖతర మగు,
సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్,
సంతుష్టుం డెందును వి