226
వాసిష్ఠరామాయణము
గీ. అహమీకానహమికలు మాయఁగ ససత్తు
సత్తు నెడ బాసి యెందు నసక్తుఁ డగుచు
నమలుఁడును సముఁ డై యుంట యదియ తుర్య
మండ్రు; వేదాంతవిదులు లోకాధినాథ.267
వ. సంకల్పంబులేమిచే నిది జాగ్రత్తయు స్వప్నంబునుం గాదు. జాడ్యస్థితి
లేమిం జేసి సుషుప్తియుఁ గా. దహంకారనిరసనంబున సమతోదయం
బునం జిత్తంబు వియదాకృతి యగుచుండఁ దుర్యావస్థ సంభవించు.
నీవు ప్రబుద్ధుఁడవు గాన, భవత్ప్రబోధవృద్ధిం బొందెద విఁక వ్యాధ
వృత్తాంతం బెఱింగించెద నాకర్ణింపుము.268
వ్యాధోపాఖ్యానము
సీ. ఒకకానలోపల నొకకిరాతు డేటు
వడి పాఱుమృగము వెంబడిన బఱచి
కానక యచ్చోట మౌని నొక్కనిఁ గాంచి
యెటు వారె మృగ మని యి ట్లొకింత
యద్భుతంబుగ వారి నడిగిన, నమ్మౌని౼
సౌఖ్యమౌనుల, మేము సముల, మడవి
నుందుము, వ్యవహారయోగ్యమౌ నట్టి య
హంకార మెందు మాయాత్మ లేదు,౼
గీ. అనెడు మునినాథు పలుకుల కర్థ మెఱుగ
కా కిరాతుడు దనయిచ్చ నవల నరిగె.
నిఖిలసంకల్పములఁ బాసి నీవు నట్లు
తుర్యపదమును బొందు సుస్థైర్యలీల.269
వ. అట్లు గావునఁ బ్రశాంతి నభేదచిత్తు లైన మును లెచ్చోట నున్నను
ముక్తులే యని వ్యాధోపాఖ్యానంబు చెప్పిన విని రామచంద్రుండు
సంతుష్టాంతరంగుం డై యమ్మునివల్లభునకు సమస్కరించి౼చిత్తవి